టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గతేడాది చివర్లో వచ్చిన ‘శంబాల’ (Shambala) సినిమాతో ఆది సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్తో మలిచారు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు.. ఆది సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది కెరీర్లో ఇది ఒక విభిన్నమైన చిత్రమని చెప్పొచ్చు. డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించింది. ఇక థియేటర్లలో ఈ మిస్టరీని మిస్ అయిన వారి కోసం ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
Also Read : Nidhi Agerwal : ఇండస్ట్రీ నెగిటివ్ క్యాంపెయిన్పై.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ (Aha) భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ‘ఆహా గోల్డ్’ (Aha Gold) సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మీరు గోల్డ్ మెంబర్షిప్ కలిగి ఉంటే ఇప్పుడే ఈ సినిమాను చూసేయొచ్చు. ఇక రెగ్యులర్ సబ్స్క్రైబర్లు మాత్రం మరో 24 గంటలు వేచి చూడాల్సి ఉంటుంది, వీరికి రేపటి నుండి ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శంబాల’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మీరు గనుక ఆహా గోల్డ్ యూజర్ అయితే, వెంటనే ఈ అదిరిపోయే డివోషనల్ థ్రిల్లర్ను వీక్షించండి.
