Koregaon-Bhima Violence Case: జైలు నుంచి ఉద్యమకారుడు గౌతమ్ నవ్లఖా విడుదల.. గృహ నిర్బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koregaon-Bhima Violence Case: కోరేగావ్-భీమా కేసులో 2020 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాను గృహనిర్బంధంలో ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైద్య కారణాలపై గౌతమ్ అప్పీల్ చేసిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదనను తోసిపుచ్చుతూ కోర్టు శుక్రవారం తన ఉత్తర్వులను పునరుద్ఘాటించింది.
నవీ ముంబైలోని తన ఇంట్లో ఉండనున్న గౌతమ్ నవ్లఖాను పోలీసులకు అప్పగించారు. ఆయన సీపీఎం కార్యాలయంలో ఉండాలన్న అతని బృందం ప్రతిపాదనపై ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. జనవరి 1న మహారాష్ట్రలోని కోరేగావ్-భీమాలో జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కార్యకర్త ఏప్రిల్ 2020 నుంచి జైలులో ఉన్నారు. ఎల్గార్ పరిషత్ కాంక్లే్వ్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఒక రోజు తర్వాత హింసలో ఒకరు మరణించారు. ఈ సమ్మేళనానికి మావోయిస్టుల మద్దతు ఉందని పుణె పోలీసులు ప్రకటించారు.గత వారం గౌతమ్ నవ్లఖాను 48 గంటల్లో గృహనిర్బంధానికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ విడుదల ఆలస్యమైంది, దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్ఐఏ కోర్టు ఆదేశాలను అమలుచేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపించింది. గౌతమ్ నవ్లఖాకు ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణల దృష్యా భద్రత గురించి ఎన్ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. తన నిర్ణయాన్ని సవరించాలని ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీ సుప్రీంకోర్టును కోరింది. అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడిపై పోలీసులు నిఘా ఉంచలేరా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్ఐఏ సోమవారం వరకు సమయం కోరగా.. కేసును ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
- Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్... లక్ష్మణ్కే ఓటు..
Rahul Gandhi: రాహుల్ గాంధీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖ.. ఇద్దరు అరెస్ట్
గతంలో కూడా బీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న సామాజిక కార్యకర్త స్టాన్ స్వామికి గతంలో ఎన్ఐఏ బెయిల్ మంజూరు చేయలేదు. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చివరకు ఆహారం తీసుకోవడానికి కనీసం సిప్పర్ కూడా అనుమతించకపోవడం పట్ల విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు తీవ్ర అనారోగ్య కారణాల దృష్ణ్యా ఆయన బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలంటూ స్వామి న్యాయవాదులు బాంబే కోర్టును ఆశ్రయించారు. మధ్యాహ్నం విచారణ ప్రారంభించేలోగా ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే వైద్యపరమైన రుగ్మతలకు నిశ్చయాత్మక రుజువు లేదని ఎన్ఐఏ వాదించింది.
తాజావార్తలు
-
Supreme Court: నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!