Janmabhoomi Express : విశాఖ-హైదరాబాద్ జన్మభూమి రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జన్మభూమి రైలును విశాఖలో నిలిపివేశారు. ఉదయం 6.20 గంటలకు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగిపోగా.. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును విశాఖ స్టేషన్కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు వెల్లడించారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని తెలిపారు. ఉదయం నుంచి రైలు విశాఖలోనే ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య తలెత్తిన రెండు కోచ్లు తొలగించి వేరేవాటిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాతే విశాఖ నుంచి రైలు బయలుదేరనుంది. ఇప్పటికే 3 గంటలు ఆలస్యం అయింది. ఎప్పుడు బయలుదేరుతుందో అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. నేడు తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు