NTV Telugu Site icon

Crime News: ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య

Murder

Murder

A young woman was killed by a man For Not Accepting Love in Komarambhim District: యువతుల వెంటపడి ప్రేమించమని వేధించడం అలా చేయకపోతే వారిని చంపేయడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. యువతి రోడ్డుపై వెళుతున్నప్పుడు యాసిడ్ పోసిన ఘటనలు, నడి రోడ్డుపై యువతిని కత్తితో పొడిచి చంపినట ఘటనలు, గొంతు కోసి, కారుతో గుద్ది హత్య చేసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. కొమరం భీం జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదని యువతికి పురుగుల మందు తాగించి హత్య చేశాడు ఓ యువకుడు.

Also Read: IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు!

సిర్పూర్ టి మండలంలోని వెంకట్రావ్ పెట్ గ్రామానికి చెందిన బూడే దీప (19)  వెంట చాలా కాలం నుంచి కమలాకర్ అనే వ్యక్తి పడుతున్నాడు. తనను ప్రేమించాలని అనేక సార్లు అడిగాడు. కమలాకర్ ఇప్పటికే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా కూడా ఉండటంతో దీప అతని ప్రేమను నిరాకరించింది. తన వెంట పడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే తనను ప్రేమించకపోతే దీప కుటుంబ సభ్యులను చంపేస్తానని కమలాకర్ అనేక సార్లు బెదిరించాడు. అయినా దీప అతడిని ప్రేమించలేదు. దీంతో దీప మీద కోపం తెచ్చుకున్న దుర్మార్గుడు ఆమెను అంతమొందించాలని పన్నాగం పన్నాడు. తనకు దక్కని దీప ఎవరికి దక్కకూడదనుకున్నాడు. ఆవేశంలో పశువుల మారిన కమలాకర్ యువతిని హత్య చేశాడు. దీపకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఇది గమనించిన స్థానికులు ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ దీప మృతి చెందింది. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కమలాకర్ కోసం గాలింపు చేపట్టారు. యువతిని దారుణంగా హత్య చేసిన కమలాకర్ ను పట్టుకొని తగిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.