Site icon NTV Telugu

Road Accident : పాదాచారుల ప్రాణాలు తీసిన బైక్ రైడర్

New Project (2)

New Project (2)

Road Accident : రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంది. ప్రతిరోజూ మాదిరిగానే నాసిక్ రహదారి వెంబడి కాసేపు నడిచేందుకు కొంతమంది మహిళలు జైలు రోడ్ కు వెళ్లారు. రోడ్డు మీద నడుస్తుండగా హఠాత్తుగా ఎదురైనన ఘటనతో నాసిక్ నగరమంతా ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జైలు రోడ్డు ప్రాంతంలో కొందరు మహిళలు ఎప్పటిలాగే భోజనం చేసిన తర్వాత రోడ్డు పక్కన నడుస్తున్నారు. బైకు వెనుక నుంచి అతివేగంగా ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, చిన్నారికి గాయాలయ్యాయి. ఈ ఘటన తర్వాత నాసిక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు మరింత విచారణ జరుపుతున్నప్పటికీ, ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : RCB fans : ఆర్‌సిబి గెలిచే వరకు స్కూల్‌కు వెళ్లను… ఐపిఎల్ మ్యాచ్‌లో చిన్నారి ప్లకార్డు వైరల్‌

కెనాల్ రోడ్‌లోని ఆదర్శ్ సొసైటీ నివాసితులు కరుణ అశోక్ జోగ్‌దండ్, రంజనా హిరే, మంగళ్ నికమ్, రుజితా పగారే, రేఖా దుబే, సోనాలి వినీత్ ఉన్వానే, వారి ఆరేళ్ల కుమారుడు ఇషాంత్ ఉన్వానే వాటర్ ట్యాంక్ దగ్గర షట్పావళి(వాకింగ్) చేస్తున్నారు. శివాజీ నగర్ వద్ద నడుస్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. కరుణ అశోక్ జోగ్‌దండ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న ఇషాంత్‌కు గాయాలయ్యాయి. కరుణ అశోక్ జోగ్దంద్ తీవ్ర గాయాలతో బిట్కో ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై నాసిక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో సోనాలి ఉన్హవానే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కరుణ జోగ్‌దండ్ భర్త కరోనాతో ఏడాదిన్నర క్రితం మరణించాడు.

Exit mobile version