PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన.. 36 గంటల్లో 5,300 కి.మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏడు నగరాల మీదుగా 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ క్రమంలోనే ఆయా నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధాని పర్యటన షెడ్యూల్ను శనివారం పీఎంవో అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రారంభమై మంగళవారం దమణ్ పర్యటనతో ముగుస్తుంది. తొలుత సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని బయలుదేరుతారు. 500 కిలో మీటర్ల దూరం ప్రయాణించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురహో చేరుకుంటారు. అక్కడి నుంచ రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. తర్వాత మళ్లీ ఖజురహోకు వస్తారు. తరువాత 1,700 కి.మీ ప్రయాణించి కొచ్చిలో జరగనున్న యువమ్ సదస్సుకు హాజరవుతారు.
Read Also: Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
మంగళవారం ఉదయాన్నే కొచ్చికి 150 కిలోమీటర్ల దూరంలోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వెళ్లి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రూ.3,200 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. తిరువనంతపురం నుంచి 1570 కిలోమీటర్లు ప్రయాణించి సిల్వాసాకి వెళతారు. దాద్రా, నగర్ హవేలీలో నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభిస్తారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దమణ్కు వెళ్లి.. డేవ్కా సీఫ్రంట్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి సూరత్ మీదుగా తిరిగి ప్రధాని రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు.
Read Also: Srikakulam : సాయంగా ఉంటాడనుకుంటే.. సక్కగా పెళ్లాంనే లైన్లో పెట్టాడు.. తట్టకోలేక చంపి పాతేశాడు
తాజావార్తలు
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క