Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
- ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.
- ఒక్కసారిగా మంటలు
- ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో బాద్సా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని సమాచారం. హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Eknath Shinde: సీఎంను దేశద్రోహి అని పిలిచినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే
Also Read
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్ నుంచి డబుల్ డెక్కర్ బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో బీహార్లోని సుపాల్కు వెళ్తోంది. ఆయితే ప్రయాణంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు బస్సు పైకప్పుపై ఉంచిన లగేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడుతుండడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ప్రయాణికులు వెంటనే బస్సును ఆపి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం తర్వాత యమునా ఎక్స్ప్రెస్వేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి సరైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు.
Read Also: NTV Effect: గోదావరి తీరంలో దుర్గంధ ఘటన.. సిబ్బందితో వర్థ్యాలు తొలిగింపు..
ఈ ఘటన సుదూర ప్రయాణాల్లో భద్రతపై మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అదృష్టవశాత్తూ, ప్రమాదంలో ఏ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోలేదు. కానీ సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోతే, ఫలితం భిన్నంగా ఉండేది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..