Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
- ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.
- ఒక్కసారిగా మంటలు
- ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్లో బాద్సా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని సమాచారం. హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామ సమీపంలో యమునా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Eknath Shinde: సీఎంను దేశద్రోహి అని పిలిచినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్ నుంచి డబుల్ డెక్కర్ బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో బీహార్లోని సుపాల్కు వెళ్తోంది. ఆయితే ప్రయాణంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు బస్సు పైకప్పుపై ఉంచిన లగేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడుతుండడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ప్రయాణికులు వెంటనే బస్సును ఆపి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం తర్వాత యమునా ఎక్స్ప్రెస్వేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి సరైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు.
Read Also: NTV Effect: గోదావరి తీరంలో దుర్గంధ ఘటన.. సిబ్బందితో వర్థ్యాలు తొలిగింపు..
ఈ ఘటన సుదూర ప్రయాణాల్లో భద్రతపై మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అదృష్టవశాత్తూ, ప్రమాదంలో ఏ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోలేదు. కానీ సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోతే, ఫలితం భిన్నంగా ఉండేది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!