Indonesia: గుహలో బయటపడ్డ 51,200 ఏళ్ల పురాతన పెయింటింగ్..
- ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని గుహ పైకప్పుపై పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్
- దాని వయసును కనుగొన్న ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్శిటీ శాస్త్రవేత్త
- ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ కళాఖండమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని గుహ పైకప్పుపై పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్ కనుగొనబడింది. రాళ్లపై వేసిన 51,200 ఏళ్ల నాటి పెయింటింగ్ ఇది. ఈ గుహను సున్నపురాయితో నిర్మించారు. ఈ పురాతన కళాకృతిలో, పందులను చుట్టుముట్టి వేటాడే మానవుల బొమ్మలు గీశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ కళాఖండం. ఈ పెయింటింగ్ దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని మారోస్-పాంగ్కెప్ ప్రాంతంలోని లియాంగ్ కరంపుయాంగ్ గుహలో ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ పురాతన కళాఖండాల వయస్సును తెలుసుకోవడానికి కాల్షియం కార్బోనేట్ స్ఫటికాల సహాయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్శిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మాగ్జిమ్ అబెర్ట్ మాట్లాడుతూ.. కొత్త సాంకేతికత మెరుగైన వయస్సును ఇస్తుందని చెప్పారు. ఈ పెయింటింగ్లో, ఒక పంది 36 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. దీని చుట్టూ మానవులు ఉన్నారు. ఎరుపు రంగుతో ఈ పెయింటింగ్ను రూపొందించారు. ఈ గుహలో మరిన్ని పందుల చిత్రాలు ఉన్నాయి. ఈ పెయింటింగ్ పురాతన కాలంలో కథలు చెప్పడానికి ఉపయోగించినట్లు తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
READ MORE: CM Revanth Reddy: తెలంగాణ నిఘా విభాగాలకు నిధులు కేటాయించండి.. అమిత్ షాకు సీఎం వినతి
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
నాటి మానవులు జంతువులను ఎలా వేటాడేవారు అనే విషయాన్ని ఈ పెయింటింగ్ స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ పెయింటింగ్ అసలు కథేమిటో దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు తెలియడం లేదు. అయితే దీన్ని బట్టి పూర్వం ఇక్కడ వేట జరుగుతోందని మనం ఊహించవచ్చు. అంతకుముందు, శాస్త్రవేత్తలు సులవేసిలోని లియాంగ్ బులు సిపాంగ్ 4 గుహలో పురాతన కళాఖండాలను కనుగొన్నారు. ఇందులో పంది వేటతో పాటు మరుగుజ్జు గేదె పెయింటింగ్ ను కూడా కనుగొన్నారు. ఇది దాదాపు 48 వేల సంవత్సరాల నాటి పెయింటింగ్. అయితే కొత్తగా కనుగొన్న పెయింటింగ్ పాత రికార్డును బద్దలు కొట్టింది. ఇది 51,200 సంవత్సరాల పురాతనమైనది.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!