‘హలో… నేను టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోంది. మేము ఈ నెంబర్ ను మూసివేస్తున్నాము. మీరు మీ నంబర్ను కొనసాగించాలనుకుంటే, మేము చెప్పిన వాటిని ధృవీకరించాలి…’ అని మోసపూరితమైన కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ.. ఈ కాల్ ని అలానే కొనసాగిస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బును కొట్టేస్తారు. ఇదొక సైబర్ మోసం.. +92 నంబర్ నుండి వినియోగదారుల వాట్సాప్కు కాల్లు వస్తున్నాయి. ఫోన్ చేస్తున్న వ్యక్తి మేము ఈ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నాం.. ఆ కంపెనీ నుండి ఫోన్ చేస్తున్నామని చెబుతాడు. ఆ తర్వాత.. మీరు నంబర్ మార్చుకోవాలని ఏవో మాయమాటలు చెప్పి వ్యక్తిగత సమాచారాన్ని పొందుతాడు. వారి లక్ష్యం మీ అకౌంట్ లో ఉన్న నగదును దోచేయడమే.
Heavy rain alert: ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల
మొబైల్ వినియోగదారులు తమ వాట్సాప్లో +92 వంటి విదేశీ నంబర్ల నుండి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) హెచ్చరించింది. మొబైల్ వినియోగదారుల కోసం ఒక సలహాను జారీ చేస్తూ, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఈ నంబర్ నుండి కాల్స్ వస్తే, అటువంటి పరిస్థితిలో సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov) యొక్క ‘అనుమానాస్పద మోసపూరిత కమ్యూనికేషన్ నివేదిక’పై ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపింది. ఈ విధంగా వినియోగదారులను అప్రమత్తంగా ఉంచడం వలన సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు మొదలైనవాటిని నిరోధించడంలో టెలికమ్యూనికేషన్ శాఖకు సహాయపడుతుంది. మీరు సైబర్ నేరాలు లేదా ఆర్థిక మోసాలకు గురైనట్లయితే, వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ తమ తరపున ఏ అధికారికి ఇలాంటి కాల్స్ చేయడానికి అధికారం లేదని తెలిపింది.
Chandrababu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ..
+92 కోడ్ పాకిస్తాన్ కాగా, భారత పౌరులను టార్గెట్ చేసేందుకు స్కామర్లు వాట్సాప్ను ఉపయోగిస్తున్నట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. కాలర్స్ మాత్రం పాకిస్తాన్కు చెందిన వారు కాదని, పైన ప్రస్తావించిన కేసులో స్కామర్లు బాధితుడిని సంప్రదించేందుకు వర్చువల్ నెంబర్ను ఉపయోగించి మోసానికి తెరలేపారని పోలీసులు తెలిపారు. ‘బడే భాయ్’ కుంభకోణంలో అనేక కేసులు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు దుబాయ్ నుండి కాలర్లుగా నటిస్తూ గుర్తుతెలియని వ్యక్తుల నుండి కాల్స్ అందుకున్నారని తెలిపారు.