Site icon NTV Telugu

Gaza War: గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు మృతి

Gaja

Gaja

గాజా నగరంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసమని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. ఈ ఘటనపై పాలస్తీనా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. పాఠశాల ఆవరణలో తలదాచుకున్న వారిని చంపేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో కాఫర్ ఖాసెం స్కూల్‌లో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో హమాస్‌ పబ్లిక్‌ వర్క్స్‌ అండ్‌ హౌసింగ్‌ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ మజీద్‌ సలీహ్‌ ఉన్నారు.

UP Shocker: అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె.. పరువు పొతుందని తల్లి, సోదరుల దారుణం..

హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDA) తెలిపింది. అక్కడి పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా వైమానిక దాడులు, ఇతర చర్యలను నిర్వహించామని చెప్పారు. ఆసుపత్రులు.. ఇతర ప్రభుత్వ భవనాలను సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ చేసిన వాదనలను హమాస్ ఎప్పటిలాగే తిరస్కరించింది. ఈ క్రమంలో.. ఇజ్రాయెల్ దళాలపై తమ సైనికులు అనేక దాడులు చేశారని హమాస్ సాయుధ విభాగం తెలిపింది. నివేదికల ప్రకారం.. మధ్య, దక్షిణ గాజా అంతటా వేర్వేరు వైమానిక దాడుల్లో ఆరుగురు అదనపు పాలస్తీనియన్లు మరణించారు. దీంతో ఆదివారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 16కి చేరింది. హమాస్ సాయుధ విభాగం రఫాలో ఇజ్రాయెల్ దళాలపై అనేక దాడులు చేసింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రతిస్పందనగా, రఫాలో తమ బలగాలు అనేక మంది మిలిటెంట్లను హతమార్చాయని.. అంతేకాకుండా సైనిక మౌలిక సదుపాయాలను కూల్చివేశాయని పేర్కొంది.

Devara Pre Release Event Cancelled: షాకింగ్ : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అయితే ఈ వివాదం మధ్య అవసరమైన విడి భాగాలు, జనరేటర్లకు ఇంధనం కొరత కారణంగా అన్ని ఆసుపత్రి సేవలు పది రోజుల్లో నిలిపివేయవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అదనంగా, భారీ వర్షం డేరా శిబిరాల్లో వరదలకు కారణమైంది. తద్వారా నిర్వాసిత కుటుంబాల దుస్థితి మరింత తీవ్రమవుతోంది. యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియెట్ టౌమా మాట్లాడుతూ.. శీతాకాలం రాబోతోందని, ప్రజలకు ఆశ్రయం, సామాగ్రి అవసరమని అన్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇందులో దాదాపు 1200 మంది చనిపోయారు. దీని తరువాత, ఇజ్రాయెల్ దాడుల్లో 41,300 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.

Exit mobile version