NTV Telugu Site icon

Assam Floods: అస్సాం వరదల్లో 7గురు మృతి.. 12 జిల్లాల్లో స్తంభించిన జనజీవనం

Assam Floods

Assam Floods

Assam Floods: అస్సాంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని రోజువారీ వరద నివేదిక ధృవీకరించింది. ఫ్లడ్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FRIMS) నివేదిక ప్రకారం.. బజలి, బార్‌పేట, బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, గోల్‌పరా, జోర్హాట్, కమ్రూప్, లఖింపూర్, నల్బరీ, సోనిత్‌పూర్, తముల్‌పూర్‌లతో కూడిన 12 జిల్లాలు వరదలకు గురయ్యాయి. 20 రెవెన్యూ సర్కిళ్లు ప్రభావితమయ్యాయి. 395 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియో నియామకం

పలు జిల్లాలు, సబ్ డివిజన్లలో 106 సహాయ శిబిరాలను ప్రారంభించామని, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో మొత్తం జంతువుల సంఖ్య 65,759గా ఉందని నివేదిక పేర్కొంది. ఈ రోజు వరకు మరణించిన వారి సంఖ్య 7కి చేరుకోగా, 5 జిల్లాల్లో మొత్తం 5 వైద్య బృందాలను మోహరించినట్లు నివేదిక పేర్కొంది. బిస్వనాథ్, సోనిత్‌పూర్ జిల్లాల్లో ఒక్కొక్కటి 2 కట్టలు తెగిపోయాయి. అదనంగా, రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల సంఖ్యను కూడా నివేదికలు పేర్కొన్నాయి. బక్సాలో 2, బార్‌పేటలో 22 రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ, ఈ జిల్లాల్లో 82,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని నివేదించబడింది. గత ఏడాది కంటే ఈ ఏడాది వరదల వల్ల నష్టపోయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ముందుగా తెలిపాయి.