NTV Telugu Site icon

6th Phase Elections: ఆరో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే ఓటింగ్​..

6th Phase Elections

6th Phase Elections

దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల పోలింగ్ జరిగింది. శనివారం 25 మే ఆరో దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఈ దశలో లోక్‌సభ ఎన్నికలు దేశ రాజధాని ఢిల్లీతో సహా మరో 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తంగా 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, బీహార్ 8 సీట్లు, హర్యానా 10 సీట్లు, జమ్మూ కశ్మీర్ 1, జార్ఖండ్ 4 సీట్లకుగానూ ఏకంగా 889 మంది అభ్యర్ధుల బరిలో ఉన్నారు.

Oldest Cricketer: రికార్డులు బ‌ద్ధ‌లు.. లేటు వయసులో క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన బామ్మా..

గత నెలలో ఎన్నికల సంఘం జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ తేదీని లాజిస్టికల్, కమ్యూనికేషన్ అండ్‌ కనెక్టివిటీకి సంబంధించి అడ్డంకుల కారణంగా మే 7 నుండి మే 25 కు మార్చింది. ఇక రేపు జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఇక దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు చూస్తే..

* ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, డోమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచ్లిషహర్, భదోహి

* పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్

* హర్యానా రాష్ట్రంలోని అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్

* జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి, ధన్‌బాద్, రాంచీ, జంషెడ్‌పూర్

* బీహార్ రాష్ట్రంలోని వాల్మీకి నగర్, పశ్చిమ్ చంపారన్, పూర్వి చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ , శివన్, మహారాజ్‌గంజ్

* ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, పూరి, ధెంకనల్, కియోంజర్ , కటక్, సంబల్పూర్

* జమ్మూ కశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) లో అనంతనాగ్-రాజౌరి

* ఢిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం) లో చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలలో జరుగనున్నాయి.