మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిపై కత్తితో దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో ఓ బాలుడు ఇంట్లో నిద్రిస్తున్నాడు. తల్లి కూడా అదే గదిలో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు రక్తపు మడుగులో ఉన్న కొడుకును చూసి షాక్ కు గురయ్యారు. బాలుడి మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారు బాలుడిని మహబూబాబాద్ ఏరియా హాస్పటల్ కి తరలించారు. పోలీసులకు సమాచరం అందించడంతో ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు వెల్లడించారు.