300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
300 Stones in Taiwanese woman Kidney after Takes Bubble Tea: మంచి నీరు తాగడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటికి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలనుకోవడం కూడా చాలా ప్రమాదం. నీటికి బదులుగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. తైవాన్లో 20 ఏళ్ల మహిళ కిడ్నీలో 300 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 300 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.
జియావో యు అనే మహిళకు మంచి నీరు తాగడమంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. దాంతో ఆమె నీటికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ తీసుకుంది. జియావో కొన్నేళ్లుగా నీళ్లకు బదులు స్వీట్ డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. మంచి నీరు తీసుకోక పోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్తో బాధపడుతుంది. తాజాగా జ్వరం మరియు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
Also Read
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
చి మెయి హాస్పిటల్లోని వైద్యులు జియావోకు టెస్టులు చేసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వైద్యులు ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 5 మిమీ నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండే రాళ్లను స్కాన్లో గుర్తించారు. మరోవైపు రక్త పరీక్షలో జియావో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ చేసి ఆమె కిడ్నీలోని రాళ్లను బయటకు తీశారు. రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను వెలికితీశారు. శస్త్రచికిత్స తర్వాత జియావో పరిస్థితి మెరుగుపడింది. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.
జియావోకు సర్జరీ చేసిన డాక్టర్ లిమ్ చై-యాంగ్ మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని చెప్పాడు. నీటికి బదులుగా
స్వీట్ డ్రింక్స్ తాగడం ఆమె మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీసిందన్నారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్లో చక్కెర, యాడెటివ్స్ ఉన్నాయని.. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి.. స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
-
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
-
Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!