300 Stones In Kidney: నీటికి బదులు బబుల్ టీ.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
300 Stones in Taiwanese woman Kidney after Takes Bubble Tea: మంచి నీరు తాగడం మానేయడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటికి బదులు టీ, జ్యూసెస్ తాగితే చాలనుకోవడం కూడా చాలా ప్రమాదం. నీటికి బదులుగా డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. తైవాన్లో 20 ఏళ్ల మహిళ కిడ్నీలో 300 రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 300 కిడ్నీ రాళ్లను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది.
జియావో యు అనే మహిళకు మంచి నీరు తాగడమంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. దాంతో ఆమె నీటికి బదులుగా బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ తీసుకుంది. జియావో కొన్నేళ్లుగా నీళ్లకు బదులు స్వీట్ డ్రింక్స్ మాత్రమే తాగుతోంది. మంచి నీరు తీసుకోక పోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్తో బాధపడుతుంది. తాజాగా జ్వరం మరియు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
చి మెయి హాస్పిటల్లోని వైద్యులు జియావోకు టెస్టులు చేసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా వైద్యులు ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. 5 మిమీ నుండి 2 సెంటీమీటర్ల వరకు ఉండే రాళ్లను స్కాన్లో గుర్తించారు. మరోవైపు రక్త పరీక్షలో జియావో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ చేసి ఆమె కిడ్నీలోని రాళ్లను బయటకు తీశారు. రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్సలో వైద్యులు ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను వెలికితీశారు. శస్త్రచికిత్స తర్వాత జియావో పరిస్థితి మెరుగుపడింది. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది.
జియావోకు సర్జరీ చేసిన డాక్టర్ లిమ్ చై-యాంగ్ మాట్లాడుతూ ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని చెప్పాడు. నీటికి బదులుగా
స్వీట్ డ్రింక్స్ తాగడం ఆమె మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోవడానికి దారితీసిందన్నారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్లో చక్కెర, యాడెటివ్స్ ఉన్నాయని.. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి.. స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!