NTV Telugu Site icon

Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు!

Kerala Road Accident

Kerala Road Accident

3 dead in Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇడుక్కి జిల్లా ఆదిమాలిలోని మంకులం ప్రాంతంలో ఓ టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. ఇందులో ఒక సంవత్సరం చిన్నారి ఉంది. ఈ ఘటనలో 14 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం టెంపో ట్రావెలర్ తమిళనాడు నుంచి మున్నార్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టులో చేరని జస్ప్రీత్ బుమ్రా.. కారణం అదేనా?

టెంపో ట్రావెలర్ బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెంపో ట్రావెలర్ తమిళనాడుకు చెందినది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.