Tahawwur Rana: ఉగ్రవాదికి 3 ఫోన్ కాల్స్కు పర్మిషన్.. షరతులు వర్తిస్తాయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana: 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారి తహవూర్ రాణాకు పెద్ద రిలీఫ్ లభించింది. ఈ నెలలో మూడుసార్లు ఆయన తన సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సంభాషణ జైలు అధికారుల సమక్షంలో జరుగుతుందని, ప్రతి కాల్ రికార్డ్ చేయబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. అతను హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడటానికి అనుమతి లభించింది. బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జీత్ సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
READ MORE: Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?
Also Read
వర్చువల్ కోర్టుకు..
తహవూర్ రాణాను కోర్టులో వర్చువల్ హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి అతనికి మూడు ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతించడంతో పాటు అతని జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు. కోర్టులో రాణాకు పలు సానుకూల అంశాలు లభించాయి. అతను తన ప్రైవేట్ న్యాయవాదితో చట్టపరమైన చర్చలు జరపడానికి, అతని సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి కోర్టు పర్మిషన్ లభించింది.
ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించిన ఈ కేసు విచారణను క్లోజ్డ్ రూమ్లో నిర్వహించారు. ఫోన్ కాల్స్ దుర్వినియోగాన్ని సహించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అదే సమయంలో తహవ్వూర్ రాణా తరఫు న్యాయవాది పియూష్ సన్దేవా ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లో చేర్చబడిన కొన్ని పత్రాలను పరిశీలించడానికి కోర్టు నుంచి సమయం కోరారు. దానిని న్యాయమూర్తి అంగీకరించారు.
26/11 ముంబై దాడిలో జరిగిన ప్రమాదకరమైన కుట్రతో సంబంధం ఉన్న వ్యక్తి తహవ్వూర్ హుస్సేన్ రాణా. ఈ ఉగ్రవాద దాడికి ప్రధాన కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ.. అలియాస్ దావూద్ గిలానీ. హెడ్లీ ఒక అమెరికన్ పౌరుడు. ఈ దాడి కుట్రలో తన పాత్రను అతను అంగీకరించాడు. తహవ్వూర్ రాణాను ఏప్రిల్ 4న భారతదేశానికి తీసుకువచ్చారు. గతంలో ఆయనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన సమీక్ష పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2008 నవంబర్ 26న, 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ఈ ఉగ్రవాదులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హెూటళ్లు, ఒక యూదు కేంద్రంపై వరుస దాడులు చేశారు. ఈ దాడి 60 గంటల పాటు కొనసాగింది.
ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయంకరమైన ఉగ్రవాద దాడి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. పొరుగు దేశమైన పాకిస్థాన్ పేరు ఇందులో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తహవ్వూర్ రాణా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
READ MORE: Putin safe in Alaska: అలస్కాకు పుతిన్.. అక్కడ ఆయన సేఫేనా?
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!