Tahawwur Rana: ఉగ్రవాదికి 3 ఫోన్ కాల్స్కు పర్మిషన్.. షరతులు వర్తిస్తాయ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana: 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారి తహవూర్ రాణాకు పెద్ద రిలీఫ్ లభించింది. ఈ నెలలో మూడుసార్లు ఆయన తన సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సంభాషణ జైలు అధికారుల సమక్షంలో జరుగుతుందని, ప్రతి కాల్ రికార్డ్ చేయబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. అతను హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడటానికి అనుమతి లభించింది. బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జీత్ సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
READ MORE: Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?
Also Read
వర్చువల్ కోర్టుకు..
తహవూర్ రాణాను కోర్టులో వర్చువల్ హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి అతనికి మూడు ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతించడంతో పాటు అతని జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు. కోర్టులో రాణాకు పలు సానుకూల అంశాలు లభించాయి. అతను తన ప్రైవేట్ న్యాయవాదితో చట్టపరమైన చర్చలు జరపడానికి, అతని సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి కోర్టు పర్మిషన్ లభించింది.
ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించిన ఈ కేసు విచారణను క్లోజ్డ్ రూమ్లో నిర్వహించారు. ఫోన్ కాల్స్ దుర్వినియోగాన్ని సహించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అదే సమయంలో తహవ్వూర్ రాణా తరఫు న్యాయవాది పియూష్ సన్దేవా ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లో చేర్చబడిన కొన్ని పత్రాలను పరిశీలించడానికి కోర్టు నుంచి సమయం కోరారు. దానిని న్యాయమూర్తి అంగీకరించారు.
26/11 ముంబై దాడిలో జరిగిన ప్రమాదకరమైన కుట్రతో సంబంధం ఉన్న వ్యక్తి తహవ్వూర్ హుస్సేన్ రాణా. ఈ ఉగ్రవాద దాడికి ప్రధాన కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ.. అలియాస్ దావూద్ గిలానీ. హెడ్లీ ఒక అమెరికన్ పౌరుడు. ఈ దాడి కుట్రలో తన పాత్రను అతను అంగీకరించాడు. తహవ్వూర్ రాణాను ఏప్రిల్ 4న భారతదేశానికి తీసుకువచ్చారు. గతంలో ఆయనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన సమీక్ష పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2008 నవంబర్ 26న, 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ఈ ఉగ్రవాదులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హెూటళ్లు, ఒక యూదు కేంద్రంపై వరుస దాడులు చేశారు. ఈ దాడి 60 గంటల పాటు కొనసాగింది.
ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయంకరమైన ఉగ్రవాద దాడి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. పొరుగు దేశమైన పాకిస్థాన్ పేరు ఇందులో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తహవ్వూర్ రాణా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
READ MORE: Putin safe in Alaska: అలస్కాకు పుతిన్.. అక్కడ ఆయన సేఫేనా?
తాజావార్తలు
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?