2018 Movie: రూ.15కోట్ల బడ్జెట్.. పది రోజుల్లోనే రూ.100కోట్లు.. మాలీవుడ్ మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 Movie: భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి ఇండియన్ సత్తా ఎంతో ప్రపంచానికి తెలిపింది. దేశ చిత్రపరిశ్రమల్లో మాలీవుడ్ ప్రత్యేకత వేరు. అక్కడ తక్కువ బడ్జెట్ తోటి నేటివిటీకి దగ్గరగా చిత్రాలను నిర్మిస్తుంటారు.మాలీవుడ్ చిత్రసీమలో రీసెంట్గా రిలీజైన ఓ సినిమా బాక్సాఫీస్ ఎదుట రికార్డులను సృష్టిస్తోంది. రూ.15కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అది కూడా ఇండియా రేంజ్లో కాకుండా కేవలం అక్కడి బాక్సాఫీస్వద్దే ఈ కలెక్షన్స్ను అందుకోవడం విశేషం.
Read Also:Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
టోవినో థామస్ హీరోగా జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘2018’. ‘ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ అనేది చిత్ర ఉపశీర్షిక. క్యాప్షన్కు తగ్గట్లే ఈ కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ హీరోలే అని క్యాప్షన్ అర్థం. ఈ చిత్రం ప్రస్తుత వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు.. లక్షలాది జనాలు నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్నే కథాంశంగా తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ సినిమాను తెరకెక్కించారు. సామాన్యులు హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది చిత్రసారాంశం. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఓ ప్రాంతంలో సహాయక చర్యలు ఏ విధంగా సాగాయి? ఆ సహాయక చర్యల్లో అక్కడి ప్రజలు ఎలా భాగమయ్యారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.
Read Also:Man Kills Son: రెండో భార్యతో గొడవ.. కొడుకును కత్తితో గొంతుకోసి చంపిన కసాయి తండ్రి
అత్యంత వేగంగా ఆ చిత్రం వంద కోట్ల క్లబ్లోకి చేరింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘2018’.. మే 5న కేవలం మలయాళం బాక్సాఫీస్ ముందే రిలీజ్ అయ్యింది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మలయాళ సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇటీవలే రిలీజైన ఈ చిత్రం కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు రూ.100కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టినా.. అవి ఫుల్ రన్లో ఆ మార్క్ను అందుకున్నాయి.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!