2018 Movie: రూ.15కోట్ల బడ్జెట్.. పది రోజుల్లోనే రూ.100కోట్లు.. మాలీవుడ్ మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2018 Movie: భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి ఇండియన్ సత్తా ఎంతో ప్రపంచానికి తెలిపింది. దేశ చిత్రపరిశ్రమల్లో మాలీవుడ్ ప్రత్యేకత వేరు. అక్కడ తక్కువ బడ్జెట్ తోటి నేటివిటీకి దగ్గరగా చిత్రాలను నిర్మిస్తుంటారు.మాలీవుడ్ చిత్రసీమలో రీసెంట్గా రిలీజైన ఓ సినిమా బాక్సాఫీస్ ఎదుట రికార్డులను సృష్టిస్తోంది. రూ.15కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం కేవలం పది రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అది కూడా ఇండియా రేంజ్లో కాకుండా కేవలం అక్కడి బాక్సాఫీస్వద్దే ఈ కలెక్షన్స్ను అందుకోవడం విశేషం.
Read Also:Theif : దేవుడు కలలో చెప్పాడు.. అందుకే తీసిన నగలు ఇచ్చేస్తున్నాను
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
టోవినో థామస్ హీరోగా జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘2018’. ‘ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో’ అనేది చిత్ర ఉపశీర్షిక. క్యాప్షన్కు తగ్గట్లే ఈ కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ హీరోలే అని క్యాప్షన్ అర్థం. ఈ చిత్రం ప్రస్తుత వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు.. లక్షలాది జనాలు నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్నే కథాంశంగా తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ సినిమాను తెరకెక్కించారు. సామాన్యులు హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది చిత్రసారాంశం. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఓ ప్రాంతంలో సహాయక చర్యలు ఏ విధంగా సాగాయి? ఆ సహాయక చర్యల్లో అక్కడి ప్రజలు ఎలా భాగమయ్యారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ.
Read Also:Man Kills Son: రెండో భార్యతో గొడవ.. కొడుకును కత్తితో గొంతుకోసి చంపిన కసాయి తండ్రి
అత్యంత వేగంగా ఆ చిత్రం వంద కోట్ల క్లబ్లోకి చేరింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘2018’.. మే 5న కేవలం మలయాళం బాక్సాఫీస్ ముందే రిలీజ్ అయ్యింది. సర్వైవల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి మలయాళ సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. అలా ఇటీవలే రిలీజైన ఈ చిత్రం కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో లూసిఫర్, కురూప్ లాంటి చిత్రాలు రూ.100కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టినా.. అవి ఫుల్ రన్లో ఆ మార్క్ను అందుకున్నాయి.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?