Intresting Story : 14 ఏళ్ల దూరానికి ముగింపు.. కుటుంబానికి తిరిగి చేరిన నీరజ్..!
- ఓ నిమిషం అజాగ్రత్త.. 14 ఏళ్ల దూరం
- స్వర్ణభారత్ ట్రస్టులో కొత్త జీవితం
- వాట్సాప్ వీడియో కాల్తో కలిసిన కుటుంబం
- తల్లిలా ఆదుకున్న స్వర్ణభారత్ ట్రస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intresting Story : పిల్లలు తప్పిపోవడం ఏ తల్లిదండ్రులకు అయినా పెనువేదన. వారి కోసం నిరీక్షిస్తూ గడిపే ప్రతి క్షణం యుగాల్లా అనిపిస్తుంది. అలాంటి ఒక విషాదకరమైన సంఘటనకు, 14 ఏళ్ల తర్వాత అనుకోని, కానీ హృదయాన్ని హత్తుకునే ముగింపు లభించింది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి బడేగావ్కు చెందిన పున్వాస్ కన్నౌజియా కుటుంబం తమ చిన్న కుమారుడు నీరజ్ను 14 ఏళ్ల క్రితం కోల్పోయింది. అతను తిరిగి వస్తాడని ఆశతో రోజులు గడిపారు, కానీ ఆ నిరీక్షణ తీరలేదు.
ఓ నిమిషం అజాగ్రత్త.. 14 ఏళ్ల దూరం
ఉపాధి నిమిత్తం పున్వాస్ కన్నౌజియా తన ఇద్దరు కుమారులు ధీరజ్, నీరజ్లను తీసుకుని ముంబయికి వెళ్లాడు. అక్కడ 8 ఏళ్ల నీరజ్ను బేకరీలో పనికి పెట్టాడు. బాలుడు చిన్న వయసులోనే పెద్ద నగరాన్ని చూడాలనే ఉత్సాహంతో, ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. అయితే, ఆ చిన్న ప్రయాణమే అతని జీవితాన్ని మారుస్తుందని, కుటుంబానికి అతన్ని 14 ఏళ్ల పాటు దూరం చేస్తుందని ఎవరు ఊహించగలిగారు?
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
దారితప్పిన నీరజ్ నగరంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ చివరికి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ రైల్వే పోలీసులు అతన్ని గుర్తించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారత్ ట్రస్టులో చేర్పించారు. అప్పటికి కుటుంబం అతన్ని ఎంతగా వెతికిందో, ఎంతటి బాధ అనుభవించిందో నీరజ్కు తెలియదు. కానీ, అదే సమయంలో ఓ అదృష్టం అతనికి అండగా నిలిచింది.

స్వర్ణభారత్ ట్రస్టులో కొత్త జీవితం
స్వర్ణభారత్ ట్రస్టులోని బ్రిడ్జి స్కూల్లో నీరజ్కు ఆశ్రయం లభించింది. ఈ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ అతనిని దత్తత తీసుకుని చదువు, శిక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. కేవలం విద్య మాత్రమే కాకుండా, నీరజ్కి ప్లంబింగ్, ఎలక్ట్రికల్, డ్రైవింగ్, వాహన మరమ్మతులు వంటి నైపుణ్య శిక్షణలు అందించారు. ఇవన్నీ అతని భవిష్యత్తును నిర్మించేందుకు కీలకంగా మారాయి.
వాట్సాప్ వీడియో కాల్తో కలిసిన కుటుంబం
ఇటీవల ట్రస్టు ప్రతినిధులు నీరజ్ను ముంబయికి తీసుకువెళ్లారు. అక్కడ అతను చెప్పిన వివరాల ఆధారంగా, అతని తండ్రి పని చేసిన దుకాణాన్ని గుర్తించారు. వెంటనే అతని కుటుంబానికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కనెక్ట్ చేసి మాట్లాడే అవకాశం కల్పించారు. ఎవరూ ఊహించని విధంగా, తల్లిదండ్రుల 14 ఏళ్ల నిరీక్షణ ముగిసింది!
వీడియోలో కుమారుడిని చూసిన తల్లిదండ్రుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. కన్నీళ్లతో మునిగిపోయిన వారు “మా బిడ్డ తిరిగొచ్చాడు.. ఇది నమ్మశక్యంగా లేదు!” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం ట్రస్టు ప్రతినిధులు నీరజ్ను వారణాసిలోని తన ఇంటికి చేర్చారు.
“తల్లిలా ఆదుకున్న స్వర్ణభారత్ ట్రస్టు”
తమ కుమారుడిని మళ్లీ చూడగలిగామంటే, అది స్వర్ణభారత్ ట్రస్టు కారణంగానే అని తల్లిదండ్రులు భావోద్వేగంతో తెలిపారు. “మా బిడ్డను కన్నతల్లిలా పెంచి, బతుకు దారిని చూపించిందీ ట్రస్టు. దీపా వెంకట్ మాకు దేవతలా నిలిచారు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కథ కేవలం ఓ కుటుంబ పునర్కలయిక మాత్రమే కాదు. ఇది తప్పిపోయిన ఓ చిన్నారి, సమాజం అందించిన సహాయం, విశ్వాసం, మంచితనం కలిసి ఒక గొప్ప కథను సృష్టించిన ఉదాహరణ. కొన్ని కథల ముగింపు కంటే, వాటి ప్రయాణమే మనసును హత్తుకుంటుంది. 14 ఏళ్ల దూరానికి ముగింపు పలికిన ఈ కథ కూడా అలాంటిదే!
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!