Jharkhand: జార్ఖండ్ లో ఘోరం.. గిరిజన మహిళపై 12మంది సామూహిక అత్యాచారం

Rape

Rape

Jharkhand: జార్ఖండ్‌లోని పకూర్ జిల్లాలో 36 ఏళ్ల గిరిజన మహిళపై డజను మంది గూండాలు అత్యాచారం చేసిన సిగ్గుమాలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బాధిత మహిళ తాను ఢిల్లీలో పనిచేస్తున్నానని చెప్పింది. ఆమె వారం క్రితమే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైక్‌పై కూర్చొని అంపాడుకు వచ్చింది. అంపాడకు చేరుకోగానే ప్రేమికుడు ఓ స్వీట్ షాపులో స్వీట్లు కొన్నాడు. దీని తర్వాత ప్రేమికుడు మహిళను ఫుట్‌బాల్ గ్రౌండ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న దాదాపు డజను మంది యువకులు మహిళను బలవంతంగా పట్టుకుని చెట్టు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ వారంతా ఆమెపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత ఉదయం స్పృహలోకి వచ్చిన మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

Read Also:Rajasthan: అసెంబ్లీలో రెడ్‌ డైరీ కలకలం.. రాజస్థాన్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే సస్పెన్షన్

ఘటన తర్వాత ప్రేమికుడు కూడా పరారీ అయ్యాడని, తన ప్రేమికుడి పేరు హెంబ్రామ్ అని మాత్రమే తెలుసని మహిళ పోలీసులకు చెప్పింది. అదే సమయంలో మహిళను చికిత్స నిమిత్తం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని జిల్లా ఎస్‌డిపిఓ అజిత్ కుమార్ విమల్ తెలిపారు. ఆ మహిళ తన ప్రేమికుడి పేరు చెప్పలేకపోయింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Read Also:Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!