Jan Aushadhi Kendra: ఈ షాపుల్లో 90% చౌకగా మందులు.. ఈ ఏడాది చివరి నాటికి 10000 మెడికల్ స్టోర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jan Aushadhi Kendra: సామాన్యులకు ఖరీదైన మందులను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను (JAN AUSHADHI KENDRA) ప్రారంభించింది. మధుమేహం, రక్తపోటు, గుండె ఇతర తీవ్రమైన వ్యాధులకు మందులు ఈ జన్ ఔషధి కేంద్రాలలో సుమారు 50 నుండి 90 శాతం తగ్గింపుతో లభిస్తాయి. ఇప్పుడు ఈ జన్ ఔషధి కేంద్రాల నెట్వర్క్ను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 10,000 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Read Also:New Bride Escape: నగదుతో నవ వధువు ఎస్కేప్.. లబోదిబోమంటున్న కొత్త పెళ్లి కొడుకు
Also Read
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
దేశంలో పెరగనున్న జనౌషధి నెట్వర్క్
బ్యూరో ఆఫ్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా (PMBI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రవి దధిచ్ మాట్లాడుతూ, “ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 10,000 జన్ ఔషధి కేంద్రాలు పనిచేస్తాయని భావిస్తున్నారు. మే 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9,484 జన్ ఔషధి కేంద్రాలు యాక్టివ్గా ఉన్నాయని తెలిపారు. గురుగ్రామ్లోని సెంట్రల్ వేర్హౌస్లో దధీచ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) కింద దేశవ్యాప్తంగా గురుగ్రామ్, చెన్నై, గౌహతి, సూరత్లలో నాలుగు దుకాణాలు ఉన్నాయి. గురుగ్రామ్లోని సెంట్రల్ వేర్హౌస్ అతిపెద్దది. PMBJP ప్రస్తుతం 1,800 మందులతో పాటు 285 సర్జికల్ పరికరాలను చాలా సరసమైన ధరలకు నాణ్యతలో రాజీ పడకుండా అందజేస్తోందని దధీచ్ తెలియజేశారు.
Read Also:Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్
సహకార సంఘాల్లో జన్ ఔషధి కేంద్రాల ప్రారంభం
ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు 1,000 జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభమవుతాయని, మిగిలిన జన్ ఔషధి కేంద్రాలు డిసెంబర్ నాటికి ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి పీఏసీఎస్ కమిటీలకు అనుమతి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2,000 పీఏసీఎస్ కమిటీలను ఎంపిక చేయనున్నారు. “ఈ ముఖ్యమైన నిర్ణయం PACS సొసైటీల ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా, ప్రజలకు సరసమైన ధరలో ఔషధాలను అందుబాటులో ఉంచుతుంది” అని సహకార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!