Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Says She Was Strip Searched At Bengaluru Airport: తనిఖీ పేరుతో బెంగుళూరు ఎయిర్పోర్టులో తన చొక్కా విప్పించారని కృషాని గాధ్వి అనే ఓ మహిళ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఒక మహిళ అని చూడకుండా, భద్రతా తనిఖీల సమయంలో తనతో బలవంతంగా దుస్తులు తొలగించారని.. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తుల్లో నిల్చోవాల్సి వచ్చిందని, ఇది తనకు చాలా అవమానకరమని తెలిపింది. ఒక మహిళగా ఎలాంటి పరిణామాలైతే ఎదురవ్వకూడదని కోరుకుంటామో, అలాంటి ఘోర పరిస్థితి తనకు ఎయిర్పోర్టులో ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మహిళతో చొక్కా విప్పించాల్సిన అవసరం ఏముందంటూ బెంగళూరు ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించింది.
ఈ విధంగా కృషాని చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా బెంగుళూరు ఎయిర్పోర్టు సిబ్బందిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బెంగళూరు ఎయిర్పోర్టు.. సెక్యూరిటీతో మాట్లాడి, ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి మళ్లీ ఎలాంటి స్పందన రాలేదు. సెక్యూరిటీ టీమ్ సీఐఎస్ఎఫ్కు సంబంధించిన వారు కాబట్టి, వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. దీనిపై సీఐఎస్ఎఫ్ బృందమే తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, కృషాని గాధ్వి చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ లోక్సభ సభ్యుడు పీసీ మోహన్ పేర్కొన్నారు. ఒక మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే ఆమెని తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
‘‘బెంగళూరు ఎయిర్పోర్టులో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా విప్పించారని ఒక మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆమె బ్యాడ్జీలు, బీడింగ్లతో కూడిన డెనిమ్ జాకెట్ ధరించింది. ఒక మహిళా సిబ్బందితో ప్రైవేట్గా పరీక్షించబడింది’’ అంటూ పీసీ మోహన్ ట్వీట్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? కృషాని గాధ్వి ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత తన అకౌంట్ని డీయాక్టివేట్ చేసింది. దీంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కేవలం అటెన్షన్ పొందడం కోసం ఆ ట్వీట్ చేసిందా? లేక ఎవరైనా అకౌంట్ డీయాక్టివేట్ చేయించారా? అనేది మిస్టరీగా మారింది. చూస్తుంటే, కేవలం ఆన్లైన్లో పబ్లిసిటీ పొందడం కోసమే ఆ యువతి ఆ పని చేసినట్టుగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Claims of a woman asked to remove her shirt during a security check at the #Bengaluru airport are false.
The woman was wearing a denim jacket with badges and beadings.
She was frisked privately with a female companion present, according to @CISFHQrs sources.@BLRAirport pic.twitter.com/H8n1aPVAQV
— P C Mohan (@PCMohanMP) January 4, 2023
తాజావార్తలు
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!