Bangalore Airport: తనిఖీ పేరుతో దుస్తులు విప్పించారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Says She Was Strip Searched At Bengaluru Airport: తనిఖీ పేరుతో బెంగుళూరు ఎయిర్పోర్టులో తన చొక్కా విప్పించారని కృషాని గాధ్వి అనే ఓ మహిళ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఒక మహిళ అని చూడకుండా, భద్రతా తనిఖీల సమయంలో తనతో బలవంతంగా దుస్తులు తొలగించారని.. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. ఆ దారుణ పరిస్థితుల్లో తాను లోదుస్తుల్లో నిల్చోవాల్సి వచ్చిందని, ఇది తనకు చాలా అవమానకరమని తెలిపింది. ఒక మహిళగా ఎలాంటి పరిణామాలైతే ఎదురవ్వకూడదని కోరుకుంటామో, అలాంటి ఘోర పరిస్థితి తనకు ఎయిర్పోర్టులో ఎదురైందని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మహిళతో చొక్కా విప్పించాల్సిన అవసరం ఏముందంటూ బెంగళూరు ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించింది.
ఈ విధంగా కృషాని చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆమెకు మద్దతుగా బెంగుళూరు ఎయిర్పోర్టు సిబ్బందిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బెంగళూరు ఎయిర్పోర్టు.. సెక్యూరిటీతో మాట్లాడి, ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పింది. ఆ తర్వాత ఎయిర్పోర్టు నుంచి మళ్లీ ఎలాంటి స్పందన రాలేదు. సెక్యూరిటీ టీమ్ సీఐఎస్ఎఫ్కు సంబంధించిన వారు కాబట్టి, వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపింది. దీనిపై సీఐఎస్ఎఫ్ బృందమే తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే, కృషాని గాధ్వి చేసిన ఆరోపణలు అవాస్తవమని బీజేపీ లోక్సభ సభ్యుడు పీసీ మోహన్ పేర్కొన్నారు. ఒక మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే ఆమెని తనిఖీ చేసినట్లు వెల్లడించారు.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
‘‘బెంగళూరు ఎయిర్పోర్టులో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా విప్పించారని ఒక మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవం. ఆమె బ్యాడ్జీలు, బీడింగ్లతో కూడిన డెనిమ్ జాకెట్ ధరించింది. ఒక మహిళా సిబ్బందితో ప్రైవేట్గా పరీక్షించబడింది’’ అంటూ పీసీ మోహన్ ట్వీట్ చేశారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా? కృషాని గాధ్వి ఆ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత తన అకౌంట్ని డీయాక్టివేట్ చేసింది. దీంతో.. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కేవలం అటెన్షన్ పొందడం కోసం ఆ ట్వీట్ చేసిందా? లేక ఎవరైనా అకౌంట్ డీయాక్టివేట్ చేయించారా? అనేది మిస్టరీగా మారింది. చూస్తుంటే, కేవలం ఆన్లైన్లో పబ్లిసిటీ పొందడం కోసమే ఆ యువతి ఆ పని చేసినట్టుగా కనిపిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Claims of a woman asked to remove her shirt during a security check at the #Bengaluru airport are false.
The woman was wearing a denim jacket with badges and beadings.
She was frisked privately with a female companion present, according to @CISFHQrs sources.@BLRAirport pic.twitter.com/H8n1aPVAQV
— P C Mohan (@PCMohanMP) January 4, 2023
తాజావార్తలు
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!