మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఓ మహిళ వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ మహిళ రోజుకు 60 రోటీలను తిన్నప్పటికి ఆమె ఆకలి తీరడం లేదని వాపోతున్నారు కుటుంబ సభ్యులు. ఈ వ్యాధితో బాధపగుతున్న వ్యక్తి రోజంతా ఆకలితో ఉంటాడు. ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు. దీనికి చికిత్స ఎంతో ఖర్చుతో కూడుకున్నదని వైద్యులు చెబుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజ్గఢ్లో ఓ మహిళ వింత రోగంతో బాధపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వారు రోజంతా ఆకలితో ఉంటారు. ఈ వ్యాధి వచ్చిన మహిళ చికిత్స లక్షల రూపాయలు ఖర్చు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వ్యాధికి అసలు కారణం ఏంటో ఇప్పటి వైద్యులు గుర్తించలేకపోయారు. నేటికీ ఈ వ్యాధికి గల కారణాల్లేంటో వెల్లడి కాలేదని తెలిసింది. ఆమె తరచుగా ఏదో ఒకటి తినకపోతే, ఆమె శరీరం శక్తిహీనంగా మారిపోతుందని బాధిత మహిళ మంజు కుటుంబం వెల్లడించింది. ఒక సాధారణ వ్యక్తి 3-4 రోట్టెలు తింటే ఆకలి తీరుతుంది. కానీ, మంజు ఒకేసారి కనీసం 10-12 రొట్టెలు తింటే గానీ ఆమెకు ఆకలి తీరదని చెబుతున్నారు. అలా ఆమె రోజంతా దాదాపు 50 నుంచి 60కి పైగా తింటుందని చెప్పారు.
అతిగా ఆకలి వేయడం అనేది సాధారణ శారీరక అనారోగ్యం కాదని, ఇది సైకియాట్రిక్ డిజార్డర్ అని పిలువబడే మానసిక అనారోగ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దీనిలో రోగి నిరంతరం ఆకలితో ఉంటాడు. అతను తినాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా తెలియదని… కొన్నిసార్లు ఇది బింగే ఈటింగ్ డిజార్డర్ కారణంగా కూడా జరుగుతుందని ఫరీదాబాద్లోని అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మీనాక్షి జైన్ చెప్పారు. అతిగా తినడం అనే సాధారణ విషయం మాత్రమే కాదని.. దాని వెనుక తీవ్రమైన వైద్య సమస్య ఉందని చెప్పారు. ఒక వ్యక్తి ఎంత ఎక్కువ ఆహారం తిన్నప్పటికీ అతడు నిరంతరం ఆకలితో ఉన్నప్పుడు, అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా చెప్పారు.. అలాంటి సందర్భాలలో చికిత్స ఆలస్యం చేయడం శరీరం, మనస్సు రెండింటికీ ప్రమాదకరమని చెప్పారు.
గత 3 సంవత్సరాలలో మంజు చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 5-7 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఆమె చికిత్సకు ఇకపై తమ వద్ద డబ్బు లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు ఆమెకు పండ్లు తినమని సలహా ఇచ్చారు. ఈ వ్యాధి కారణంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ కుటుంబం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.