దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫలితాల బజ్ నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల కోసం రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంలోని జలుక్ బరి అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఏమ్మెల్యేగా ఉన్నారు.
జలుక్బరి అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫలితాలు ఈరోజు, మే 4న వెలువడుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత హోరాహోరీగా పోటీ జరుగుతున్న స్థానం జలుక్బరి. ఇక్కడ బీజేపీ తరఫున ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ హిమంతను ఎదుర్కొంటున్నారు.
ఈ సీటును బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఈసారి అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీకి చెందిన హిమంత బిస్వా శర్మ జలుక్బరి స్థానాన్ని 100,000 కు పైగా ఓట్లతో గెలుపొందారు, కాంగ్రెస్కు చెందిన రామన్ చంద్ర బోర్తకూర్ను ఓడించారు.
