* నేడు జపాన్ ప్రధాని పదవికి ఎన్నికలు.. బరిలో నిలిచిన తొమ్మిది మంది అభ్యర్థులు
* కాన్పూర్: నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్.. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న టెస్ట్
* హైదరాబాద్: నేడు సీతారామ ప్రాజెక్ట్ ఫై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
* సిద్దిపేట: నేడు నంగనూరులో రుణమాఫీపై BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. అర్హులైనవారందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్.. ధర్నాలో పాల్గొననున్న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
* సిద్దిపేట: నేడు చేర్యాలలో మంత్రి కొండా సురేఖ పర్యటన.. కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కొండా సురేఖ.
* పల్నాడు: నేడు నూజెండ్ల మండలం చింతలచెరువు- అందుగుల కొత్తపాలెం, మధ్యలో గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మానానికి శంఖు స్థాపన చేయనున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు
* తిరుమల: ఇవాళ, రేపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఇవాళ రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకోనున్న జగన్.. రేపు ఉదయం 10 :30 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. దర్శనానంతరం రేణిగుంట విమానశ్రయం నుంచి బెంగళూరుకి వెళ్ళనున్న జగన్
* తిరుమల: ఎల్లుండి శ్రీవారిని దర్శించుకోనున్న సుప్రింకోర్టు సీజేఐ చంద్రచూడ్
* తిరుపతి: జగన్ పర్యటన నేపథ్యంలో హింద పరిరక్షణ సమితి, కూటమినేతల కీలక సమావేశం.. ఉదయం 11 గంటలకు ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ జరిగే సమావేశానికి హాజరుకానున్న నేతలు, హిందూ సంఘాల నేతలు, పీఠాధిపతులు.. సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేదానిపై ఉత్కంఠ
* ఉత్కంఠ రేపుతున్న మాజీ సిఎం జగన్ పర్యటన.. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం జగన్.. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనం.. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. డిక్లరేషన్ ఇచ్చాకే వెళ్లాలి లేదంటే అలిపిరి వద్దే అడ్డుకుంటామంటూ బీజేపీ, హిందూ సంఘాల హెచ్చరిక.. జగన్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత…
* కడప : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా కడప జిల్లా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు… తిరుపతి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు… కడప జిల్లా నుండి తిరుపతికి వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు… రాత్రి పది గంటల నుంచి జరుగుతున్న తనిఖీలు…
* విశాఖ: ఇండస్ట్రీస్ సమ్మిట్ కు హాజరు కానున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
* విశాఖ: నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం .. ఆర్.కె. బీచ్ లో టూరిజం వాక్ … VMRDA చిల్డ్రన్ ఎరీనాలో పర్యాటక దినోత్సవ వేడుకలు…
* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు
* విజయవాడ: తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు “ప్రపంచ పర్యాటక దినోత్సవం-2024” కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణం ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం.పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్..
* విశాఖ: నేడు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం.. నగరాన్ని కమ్మేసిన దట్టమైన మేఘాలు, ఉరుములు .,..
* తిరుపతి: జగన్ పర్యటన నేపథ్యంలో కూటమి సహా వైసిపి నేతలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు
* తిరుమల: 17 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,328 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,033 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు
* నంద్యాల: మహానంది క్షేత్రంలో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు, సాయంత్రం పల్లకి సేవ.. మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రుల పోస్టర్ను నేడు విడుదల చేయనున్న ఈవో, అధికారులు
* తిరుపతి లడ్డు వివాదంపై నేడు ఆర్యవైశ్యుల నిరసన ప్రదర్శన
* అమరావతి: నేడు బీజేపీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ సమీక్ష సమావేశం.. పాల్గొననున్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి..
* అమరావతి: నేడు తిరుమలకు జగన్.. తాడేపల్లి నివాసం నుంచి 3.20కి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వెళ్లనున్న జగన్.. 4.50కి రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేసుకుని 5 గంటలకు తిరుమల బయలుదేరనున్న జగన్.. ఇవాళ కూడా గోదావరి జిల్లాల నేతలతో జగన్ సమావేశం