NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ముంబైలో వర్ష బీభత్సం.. భారీ వర్షంతో ముంబై అతలాకుతలం.. తెల్లవారుజాము వరకు దంచికొట్టిన వర్షం.. వరదనీటిలో మునిగిన రైలు పట్టాలు.. సబర్బన్‌ రైళ్ల నిలిపివేత, పలు విమానాల దారి మళ్లింపు.. ముంబైకి ఐఎండీ రెడ్‌ అలర్ట్.. నేడు పుణె, ముంబైలోని విద్యాసంస్థలకు సెలవు

* నేడు జనసేనలో చేరనున్న వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య

* రాజన్న సిరిసిల్ల: నేడు బోయినపల్లి మండలం కొదురుపాకలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన.. ఉదయం 11:30 గంటలకు బోయినపల్లి మండలం, కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ-తాతయ్య కీ.శే. జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ప్రారంభించనున్న కేటీఆర్

* ప్రకాశం : చీమకుర్తి మండలం రామతీర్థంలో 3.5 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్..

* ప్రకాశం : మార్కాపురం రాజ్యలక్ష్మి కాలనీలో ఇది మంచి ప్రభుత్వం, మరియు స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ, హాజరుకానున్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి..

* తిరుమల: అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఈ సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..

* తిరుపతి జిల్లా: వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు.. కుంకుమలు.. సారె సమర్పణ. మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మ వారికి ప్రాణ ప్రతిష్ట చేసిన అమ్మవారి సేవకులు. సమగ్రరూపం దాల్చి భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్నమ్మ శ్రీ పోలేరమ్మ.

* రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో జరిగే శ్రీ పోలేరమ్మ జాతరలో పాల్గొంటారు

* నేడు ఉదయం 11:00 గంటలకు తిరుపతి జిల్లా, వెంకటగిరిలో పోలేరమ్మ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కందుల దుర్గేష్

* కాకినాడ: నేటి నుంచి మూడు రోజుల పాటు రంగరాయ మెడికల్ కాలేజ్ లో సౌత్ ఇండియా మెడికల్ లీగల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్.. పాల్గొనున్న సౌత్ ఇండియా కి చెందిన ఆరు రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులు.. నేర నిర్ధారణలో న్యాయవ్యవస్థకు ఫోరెన్సిక్ నిపుణుల సాంకేతిక సహకారం పై సదస్సు

* నెల్లూరు జిల్లా: ఒంగోలు మాజీ ఎంపీ పార్వతమ్మ మృతదేహానికి నేడు అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం.. పార్వతమ్మకు నివాళులర్పిస్తున్న వివిధ పార్టీల నేతలు.. ప్రజలు

* రేపు కాలినడకన తిరుమలకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌..

* శ్రీ సత్యసాయి : తాడిమర్రి మండల కేంద్రంలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

* అనంతపురం : గుత్తి మండలం జక్కల చెరువు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే గుమ్మనూరు.

* తిరుమల: 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,939 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 22,668 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు

* విశాఖ: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో రోజు ఉత్తరాంధ్ర పర్యటన… NTR భవన్ లో పార్టీ ముఖ్య నాయకత్వంతో సమావేశాలు.. మధ్యాహ్నం రీజనల్ లైబ్రరీ పరిశీలించ నున్న లోకేష్.. విశాఖ నుంచి విజయనగరం వెళ్ళనున్న మంత్రి లోకేష్‌..

* శ్రీకాకుళంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాల వివ‌రాలు.. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస శాసనసభ్యులు గౌతు శిరీష..

* ప్రకాశం : ఇవాళ జనసేన పార్టీలో చేరనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరనున్న బాలినేని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న బాలినేని.. ఇవాళ అతికొద్ది మంది మాత్రమే బాలినేనితో పార్టీలో చేరిక…