ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో అర్థ రాత్రి ఓ భవనం కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది అక్కడికిక్కడే చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అగస్టు 27న ముంబై సిటీకి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న విరార్ సిటీలో ఓ భవనంలో జోయల్ కుటుంబం.. తమ కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇంతలోనే అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపుగా 12 మంది అక్కడికిక్కడే చనిపోగా.. మరి కొంత మందిని శిథిలాల నుంచి బయటకు తీసి.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు.
2012లో నిర్మించిన ఈ భవనంలో 50 ఫ్లాట్లు ఉన్నాయని.. కూలిపోయిన భాగంలో 12 ఫ్లాట్లు ఉన్నాయని జిల్లా విపత్తు నిర్వహాణ అధికారి వివేకానంద్ కదమ్ తెలిపారు. ఈ భవనం అనధికారంగా నిర్మించినట్లు వాసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రమాదం జరిగినపుడు పక్కన ఇళ్లను కూడా ఢీకొట్టాయి. అయితే అపుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు. 30గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ఇప్పటి వరకు 18 మరణించారని.. మరో ఆరుగురిని శిథిలాల నుంచి వెలికి తీశారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్పుకొచ్చారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
వీవీఎంసీ డెవలపర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. శిథిలాల కింద కొంత మంది చిక్కుకుని ఉండవచ్చని.. వారి కోసం వెతుకుతున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు.
