Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్ హిమపాతంలో 9కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ హిమపాతంలో గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో హిమపాతం సంభవించి వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఉత్తరకాశీ జిల్లాలోని ద్రౌపది కా దండ శిఖరం వద్ద వారంతా చిక్కుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సహయక, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.
మొత్తం 41 మంది ట్రైనీ పర్వతారోహకుల టీము హిమపాతంలో చిక్కుకుంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మరణించి వారి సంఖ్య 9కి చేరింది. ఇంకా 29 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మంగళవారం డోక్రానీ బమాక్ హిమనీనదం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన రోజే నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గురువారం మరో ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
Read Also: Flag War : భారత్-పాక్ల మధ్య జెండా యుద్ధం.. దేశంలో అతి పెద్దదైన జెండా ఏర్పాటుకు సిద్ధం
జమ్మూ కాశ్మీర్ గుల్ మార్గ్ లోని ఆర్మీ హై ఆల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్ నుంచి 14 మంది నిపుణుల బృందాన్ని రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపారు. రెస్య్కూ ఆపరేషన్ కోసం మరిన్ని టీములను ఐటీబీపీ మట్లీ, ఉత్తరకాశీ నుంచి బేస్ క్యాంపులకు పంపారు. 16000 అడుగుల ఎత్తులో ఆధునాతన హెలికాప్టర్ ల్యాండింగ్ గ్రౌండ్ సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే రాబోయే మూడు రోజులు వర్షం, మంచు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తర కాశీ జిల్లా యంత్రాంగం రాబోయే మూడు రోజులు ట్రెక్కింగ్ , పర్వతారోహణ కార్యక్రమాలను నిషేధించింది.
విషాదం ఏమిటంటే ఈ హిమపాతం ప్రమాదంలో మరణించిన వారిలో ప్రముఖ పర్వతారోహకురాలు సవితా కన్స్వాల్ కూడా ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఎవరెస్ట్, మకాలు పర్వతాలను అధిరోహించి జాతీయ రికార్డు సృష్టించారు సవితా కన్స్వాల్. హిమపాతం సంభవించిన 17,000 అడుగుల ఎత్తైన ప్రాంతాన్ని బుధవారం ఉత్తరాఖండ్ సీఎ పుష్కర్ సింగ్ ధామి సందర్శించారు.
తాజావార్తలు
-
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
-
Toxic: యష్ ఇచ్చిన హింట్తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
-
E100 Flex-Fuel Car: పెట్రోల్ ఖర్చుకు గుడ్బై చెప్పే రోజులు దగ్గర్లోనే.. E100 ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును తీసుకొస్తున్న మారుతి
-
Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
-
US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?