తల్లి చనిపోయిందని కూతురు శోకంలో ఉంటే.. గంటల వ్యవధిలోనే కట్టుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఓ ఆడ కూతురికి అంతులేని విషాదంగా మారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలియాలంటే ఈ విషాద వార్తను చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా నివాసి అయిన దీపక్ శర్మ (27), తన అత్తగారైన ఊర్మిళా దేవి (50) మే 19న కేన్సర్స్తో చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం తన భార్య, కుమార్తెతో కలిసి గోండాలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇక ఘాగ్రా నది ఒడ్డున ఊర్మిళా దేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు.. చేతులు కడుక్కునేందుకు దీపక్ నదిలోకి దిగాడు. చేతులు కడుక్కునేందుకు వంగినప్పుడు మెరుపు వేగంతో అతి పెద్ద మొసలి అమాంతంగా దాడి చేసింది. దీపక్ తలను దవడలతో పట్టుకుని వేగంగా నదిలోకి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే లోపలికి తీసుకెళ్లి పోయింది. ఈ హఠాత్తు పరిణామంతో అందరూ షాక్కు గురయ్యారు.
బంధువులు, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే జనాలు ఉన్న ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మే 21న పైపు వంతెన సమీపంలో దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అజిత్ కుమార్ రజత్ మాట్లాడుతూ.. దీపక్ శర్మ తన అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడని తెలిపారు. సోనౌలి గ్రామంలోని నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో దీపక్ చేతులు, కాళ్లు కడుక్కోవడానికి నదిలోకి వెళ్లగా ఒక భారీ మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లిందని.. మే 21వ తేదీన అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనూ.. గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
