UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- అత్తగారి అంత్యక్రియల్లో దారుణం
- నదిలో చేతులు కడుక్కుంటుండగా మొసలి దాడి
- మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి చనిపోయిందని కూతురు శోకంలో ఉంటే.. గంటల వ్యవధిలోనే కట్టుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఓ ఆడ కూతురికి అంతులేని విషాదంగా మారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలియాలంటే ఈ విషాద వార్తను చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా నివాసి అయిన దీపక్ శర్మ (27), తన అత్తగారైన ఊర్మిళా దేవి (50) మే 19న కేన్సర్స్తో చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం తన భార్య, కుమార్తెతో కలిసి గోండాలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇక ఘాగ్రా నది ఒడ్డున ఊర్మిళా దేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు.. చేతులు కడుక్కునేందుకు దీపక్ నదిలోకి దిగాడు. చేతులు కడుక్కునేందుకు వంగినప్పుడు మెరుపు వేగంతో అతి పెద్ద మొసలి అమాంతంగా దాడి చేసింది. దీపక్ తలను దవడలతో పట్టుకుని వేగంగా నదిలోకి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే లోపలికి తీసుకెళ్లి పోయింది. ఈ హఠాత్తు పరిణామంతో అందరూ షాక్కు గురయ్యారు.
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
బంధువులు, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే జనాలు ఉన్న ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మే 21న పైపు వంతెన సమీపంలో దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అజిత్ కుమార్ రజత్ మాట్లాడుతూ.. దీపక్ శర్మ తన అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడని తెలిపారు. సోనౌలి గ్రామంలోని నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో దీపక్ చేతులు, కాళ్లు కడుక్కోవడానికి నదిలోకి వెళ్లగా ఒక భారీ మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లిందని.. మే 21వ తేదీన అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనూ.. గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
-
Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
-
Astrology: జూలై 3 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!