UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- ఉత్తరప్రదేశ్లో ఘోరం
- అత్తగారి అంత్యక్రియల్లో దారుణం
- నదిలో చేతులు కడుక్కుంటుండగా మొసలి దాడి
- మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి చనిపోయిందని కూతురు శోకంలో ఉంటే.. గంటల వ్యవధిలోనే కట్టుకున్న భర్త కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఓ ఆడ కూతురికి అంతులేని విషాదంగా మారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అసలేం జరిగింది.. గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎలా ప్రాణాలు కోల్పోయారో తెలియాలంటే ఈ విషాద వార్తను చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా నివాసి అయిన దీపక్ శర్మ (27), తన అత్తగారైన ఊర్మిళా దేవి (50) మే 19న కేన్సర్స్తో చనిపోయింది. దీంతో అంత్యక్రియల కోసం తన భార్య, కుమార్తెతో కలిసి గోండాలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇక ఘాగ్రా నది ఒడ్డున ఊర్మిళా దేవి అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాళ్లు.. చేతులు కడుక్కునేందుకు దీపక్ నదిలోకి దిగాడు. చేతులు కడుక్కునేందుకు వంగినప్పుడు మెరుపు వేగంతో అతి పెద్ద మొసలి అమాంతంగా దాడి చేసింది. దీపక్ తలను దవడలతో పట్టుకుని వేగంగా నదిలోకి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే లోపలికి తీసుకెళ్లి పోయింది. ఈ హఠాత్తు పరిణామంతో అందరూ షాక్కు గురయ్యారు.
Also Read
- Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
- Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
- Kerala Heavy Rains: కేరళలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్రకు గేట్వే.. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకతలివే..
బంధువులు, కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే జనాలు ఉన్న ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మే 21న పైపు వంతెన సమీపంలో దీపక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అజిత్ కుమార్ రజత్ మాట్లాడుతూ.. దీపక్ శర్మ తన అత్తగారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడని తెలిపారు. సోనౌలి గ్రామంలోని నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో దీపక్ చేతులు, కాళ్లు కడుక్కోవడానికి నదిలోకి వెళ్లగా ఒక భారీ మొసలి అతడిని నదిలోకి లాక్కెళ్లిందని.. మే 21వ తేదీన అతని మృతదేహాన్ని వెలికితీసినట్లు చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఇక గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలోనూ.. గ్రామంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Trump-Iran: ఈ వారాంతంలో ఇరాన్పై భారీ దాడి జరగనుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం
-
Janhvi Kapoor: ‘రాకా’లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
-
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
-
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
-
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!