NTV Telugu Site icon

ట్విట్ట‌ర్‌కు యూపీ పోలీసుల లీగ‌ల్ నోటీసు

legal notice

ఓవైపు ట్విట్ట‌ర్, భార‌త ప్ర‌భుత్వం మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది.. మ‌రోవైపు.. తాజాగా ట్విట్ట‌ర్ ఇండియాకు లీగ‌ల్ నోటీసులు పంపించారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు.. ఇటీవల యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడి ఘ‌ట‌న‌లో మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు ఈ నోటీసులు జారీ చేసిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.. సూఫీ అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తి తనపై దాడి చేసిన ముఠా.. వందేమాతరం, జై శ్రీరాం.. నినాదాలు చేశారని ఆరోపించ‌గా.. ఈ ఘటనలో మతపరమైంది ఏమీ లేదని యూపీ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఆ దాడి ఆరోపణలకు సంబంధించిన వీడియోను కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌గా.. థర్డ్‌ పార్టీ కంటెంట్‌ను కలిగి ఉంద‌ని.. ఆ వీడియోను తొలగించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ విష‌యంలోనే.. ట్విట్టర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌కు లీగల్‌ నోటీసు పంపారు యూపీ పోలీసులు.. వారం రోజుల్లోగా.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌‌ మహ్వేశ్వరిని ఆదేశించారు పోలీసులు. కాగా, ఈ కేసులో ఇప్ప‌టికే పలువురు జర్నలస్టులు, కొందరు నాయకులపై సైతం ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేశారు పోలీసులు.