Site icon NTV Telugu

Uttar Pradesh: కోర్టులో లొంగిపోయిన కేంద్రమంత్రి కుమారుడు

Asish Mishra

Asish Mishra

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై నమోదైన కేసులో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతవారం రద్దు చేసింది. ఆశిష్ మిశ్రా బయట ఉంటే ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని బాధితులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో బాధితులు తమ వాదనలను వినిపించేందుకు అలహాబాద్ హైకోర్టులో అవకాశం దొరకలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో బాధితుల తరుపున అంశాలను అలహాబాద్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆశిష్ మిశ్రా లఖింపూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం లొంగిపోయాడు. లఖింపూర్ కేసుకు సంబంధించి దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం సిట్ వేయగా ఓ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Chennai: ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చిన రైలు.. తప్పిన ప్రాణనష్టం

Exit mobile version