Site icon NTV Telugu

Union Budget 2026: రేర్ ఎర్త్ ఖనిజాలకు పెద్ద పీట.. సెమీ-కండక్టర్ ఇండస్ట్రీకి రూ. 40,000 కోట్లు..

Union Budget (1)

Union Budget (1)

Union Budget 2026: ప్రస్తుతం కాలంలో టెక్నాలజీకి ఎంతో అవసరమైన సెమీ కండక్టర్లు, రేర్ ఎర్త్ ఖనిజాలకు కేంద్ర బడ్జెట్ 2026 పెద్ద పీట వేసింది. సెమీకండక్టర్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు భారత్ సెమీ-కండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు.

Read Also: Union Budget 2026: కాంచీవరం చీరలో నిర్మలా సీతారామన్.. 9 బడ్జెట్లు 9 రకాల చీరలు..

అంతర్జాతీయంగా జియోపాలిటిక్స్‌లో కీలకంగా రేర్ ఎర్త్ ఖనిజాలు, రేర్ ఎర్త్ అయస్కాంతాలు మారాయి. ఈ రంగంలో చైనా గుత్తాధిపత్యం చెలాయిస్తోంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు భారత్ కూడా రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ, అయస్కాంతాల తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్‌లో తమిళనాడు, కేరళ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో ‘‘రేర్ ఎర్త్ కారిడార్’’ ఏర్పాటు చేయబోతున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఈ రాష్ట్రాలు అరుదైన ఖనిజాలను కలిగి ఉన్నాయి. మైనింగ్ మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్, ఎగుమతుల్ని సులభతరం చేసే ఓడరేవులు సమీపంలో ఉన్నాయి. భారత్ రేర్ ఎర్త్స్ దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు ఇది సహకరిస్తుంది. ఎలక్ట్రానిక్స్,రక్షణ, క్లీన్ ఎనర్జీ, ఈవీ ఇండస్ట్రీల్లో సెమికండక్టర్లు, రేర్ ఎర్త్ పరికరాలు చాలా అవసరం.

Exit mobile version