Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
- ట్విషా శర్మ మృతి కేసులో కొనసాగుతోన్న ట్విస్ట్
- ఇంకా బయటకు రాని రెండో పోస్ట్మార్టం రిపోర్ట్
- న్యాయస్థానానికి తెలిపిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. మొదటి నుంచి ఈ కేసుపై అనేక అనుమానాలు ఉన్నాయి. భర్త, అత్త చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వచ్చింది. అంతేకాకుండా మొదటి పోస్ట్మార్టం రిపోర్ట్పై కూడా సందేహాలు ఉండడంతో ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులతో పంచనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక న్యాయస్థానం ఆదేశాలతో రెండో పాస్ట్మార్టం కూడా జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 24 రోజులైంది. కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ బయటకు రాలేదు. దీంతో అనేక సందేహాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కానీ రెండో పోస్ట్మార్టం రిపోర్ట్ మాత్రం ఇంకా అందలేదు. అయితే మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నివేదిక ఆలస్యం అవుతోందని సంకేతాలు వస్తున్నాయి. అయితే జూన్ 16న జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ బృందం ఈ సమాచారాన్ని భోపాల్ కోర్టుకు అందించింది . రెండవ పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాతే ట్విషా మరణానికి స్పష్టమైన కారణం వెల్లడవుతుంది. ఆ దిశగా సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తుంది. అయితే 24 రోజులు గడిచినా సీబీఐకి పోస్ట్మార్టం నివేదిక ఎందుకు అందలేదు అనేదే అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Also Read
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
వాస్తవానికి ట్విషా శర్మ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2026 మే 24న రెండవ పోస్ట్మార్టం పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన వైద్యుల బృందం భోపాల్లోని ఎయిమ్స్లో ఈ పోస్ట్మార్టం పరీక్షను పూర్తి చేసింది. రెండవ పోస్ట్మార్టం జరిగి 24 రోజులు గడిచినా.. ఇప్పటి వరకు నివేదిక ఇంకా అందలేదు.
ఢిల్లీ ఎయిమ్స్లోని వైద్యుని ప్రకారం.. ట్విషా రెండవ పోస్ట్మార్టం నిర్వహిస్తున్న బృందం ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఇంకా ఒకటి రెండు పరీక్షలు చేయాల్సి ఉంది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. పోస్ట్మార్టం నివేదిక రావడంలో ఆలస్యానికి ఇదే కారణం. అన్ని పరీక్షలు పూర్తయిన వెంటనే నివేదికను సీబీఐ బృందానికి అందజేస్తారని సమాచారం. భోపాల్లోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ట్విషా శర్మ మొదటి పోస్ట్మార్టం పరీక్షలో ఆమె ఉరి వేసుకోవడం వల్ల మరణించినట్లు నిర్ధారించారు. ట్విషా శరీరంపై గాయాలు ఉన్నట్లు కూడా ఆ నివేదికలో వెల్లడి కావడంతో ఈ కేసు మరింత అనుమానాస్పదంగా మారింది.
నోయిడా నివాసి అయిన ట్విషా శర్మకు 2025 డిసెంబర్లో భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. మే 12న కటారా హిల్స్లోని తన ఇంట్లో ట్విషా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె మరణానికి సంబంధించి ఆమె భర్త సమర్థ్, అత్తగారు, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ జైలులో ఉన్నారు. రెండో రిపోర్ట్ బయటకు వస్తేనే అనుమానాలు నివృత్తి అవుతాయి. లేదంటే సస్పెన్ష్ ఇలానే కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!