Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్
- వెలుగులోకి వీడియో
- సంచలనంగా మారిన కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె మరణానికి ముందు ఏం జరిగిందో.. అందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. మరణానికి ముందు ట్విషా శర్మ ఇంటి మెట్లపైకి వెళ్లింది. కొద్దిసేపటికే ఆమె శవాన్ని భర్తతో పాటు మరొకరు కిందకు తీసుకొచ్చారు. వీడియో బయటకు రావడంతో కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలోని అత్తింట్లో ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది.
ట్విషా శర్మ ఇంటి టెర్రస్ వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అనంతరం ఆమెను కాపాడేందుకు కనీసం ముగ్గురు వ్యక్తులు CPR ఇవ్వడానికి ప్రయత్నించినట్లు వీడియోలో ఉంది. వీరిలో ఆమె భర్త సమర్థ్ సింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సార్లు CPR ప్రయత్నాలు విఫలమైన తర్వాత ట్విషా మృతదేహాన్ని మెట్లదారిలో కిందికి తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపించాయి. ఆ సమయంలో అత్త గిరిబాలా సింగ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
మే 12న భోపాల్లోని భర్త ఇంట్లో ట్విషా శర్మ మృతి చెందింది. ప్రస్తుతం ఆమె భర్త సమర్థ్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతనిపై, అతని తల్లి గిరిబాలా సింగ్పై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం కేసులు నమోదు చేశారు. గిరిబాలా సింగ్ రిటైర్డ్ జడ్జి కావడం గమనార్హం. పోలీసుల సమాచారం ప్రకారం ట్విషా శర్మ.. సమర్థ్ సింగ్ 2024లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. అనంతరం 2025 డిసెంబర్లో వివాహం చేసుకున్నారు.
ఇక సమర్థ్ సింగ్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లో ట్విషా శర్మ డ్రగ్స్కు బానిసైందని, మానసిక చికిత్స కూడా తీసుకుంటోందని పేర్కొనడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే గిరిబాలా సింగ్కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు. SIT అధిపతి, మిస్రోడ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్నీష్ కశ్యప్ మాట్లాడుతూ.. సమర్థ్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.
భోపాల్ ఎయిమ్స్ విడుదల చేసిన ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక ప్రకారం ట్విషా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ట్విషా కుటుంబం మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతోంది. ఇక బెయిల్ పిటిషన్లో ట్విషా డ్రగ్స్ తీసుకోలేని సమయంలో చిరాకు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపించేవని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై SIT అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!