Lightning strikes: పిడుగుల బీభత్సం.. యూపీలో 14 మంది, బిహార్లో 5గురు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning strikes: ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు ఘటనల్లో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.రిలీఫ్ కమిషనర్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. పిడుగుపాటు కారణంగా బండాలో నలుగురు, ఫతేపూర్లో ఇద్దరు, బల్రాంపూర్, చందౌలీ, బులంద్షహర్, రాయ్ బరేలీ, అమేథి, కౌశాంబి, సుల్తాన్పూర్ మరి, చిత్రకూట్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పిడుగుపాటు గురై చనిపోయిన వారికి సీఎం ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల చొప్పున అందించాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించినట్లు ఓ ప్రకటన తెలిపింది. క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Volleyball in Flood water: వరద నీటిలో వాలీబాల్.. ఎక్కడో తెలుసా?
Also Read
- Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
- Mamata Banerjee: అభిషేక్పై దాడి.. మమతకు అండగా ఖర్గే, అఖిలేష్ యాదవ్..
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
మరోవైపు బిహార్లో పిడుగుపాటుకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటు కారణంగా ఐదుగురు మృతి చెందడం పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో పిడుగుపాటుకు 5 మంది మృతి చెందడం బాధాకరమని, మృతులపై ఆధారపడిన వారికి తక్షణమే రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తామని, జాగ్రత్తగా ఉండండి అని ముఖ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పత్రికా ప్రకటన ప్రకారం.. సివాన్లో ఒకరు, సమస్తిపూర్లో 1, గయాలో 1, ఖగారియాలో 1, సరన్లో 1 పిడుగుపాటు కారణంగా మరణించారు. ఇదిలా ఉండగా.. జులై 20 , 21 తేదీలలో ఒడిశా, బిహార్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది.
తాజావార్తలు
-
Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
-
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..