ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 39,742 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 535 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 39,972 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,71,901కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,05,43,138 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతిచెందనవారి సంఖ్య 4,20,551 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,08,212 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 43,31,50,864 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
corona