Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- బెంగాల్ ఓటమి తర్వాత టీఎంసీలో కల్లోలం.
- అస్సాం టీఎంసీ చీఫ్ అభిజిత్ మజుందార్ రాజీనామా.
- “ముస్లింల కోసమే పార్టీ పని చేస్తోంది” అంటూ ఆరోపణలు.
- వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి కన్నా ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే మమతా బెనర్జీని ఇంకా ఎక్కువ భయపెడుతున్నాయి. మరికొంత కాలం తర్వాత టీఎంసీ ఉంటుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అరాచకాలపై సీఎం సువేందు అధికారి విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు, పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం దీదీని కలవరపెడుతోంది.
తాజాగా అస్సాం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అభిజిత్ మజుందార్ శుక్రవారం పార్టీకి రాజీనమా చేశారు. మజుందార్ తన లేఖను మమతా బెనర్జీకి ఈమెయిల్ చేశారు. తన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో పార్టీ ప్రతిష్ట క్రమంగా ‘‘కేవలం ముస్లింల కోసమే పనిచేసే సంస్థ’’గా మారిందని ఆరోపించారు. ఇదే వైఖరి బెంగాల్లో కూడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను టీఎంసీలో కొనసాగలేదనని, పార్టీ పనితీరు, రాజకీయ దిశ కారణంగా సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఆయన అన్నారు.
Also Read
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
- Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
- KCC New Rules 2026: కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
ఇప్పటికే బెంగాల్ టీఎంసీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వందలాది మంది పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి సంబంధిత వివాదాలపై పార్టీని సమర్థించలేకపోతున్నానని అన్నారు. ఇక టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ మరో రెండేళ్ల వరకు టీఎంసీ నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
-
Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
-
SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
-
NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
-
Bandla Ganesh: ‘పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే’.. నిరంజన్ కుటుంబానికి బండ్ల గణేష్ ఆర్థిక చేయూత
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!