Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- బెంగాల్ ఓటమి తర్వాత టీఎంసీలో కల్లోలం.
- అస్సాం టీఎంసీ చీఫ్ అభిజిత్ మజుందార్ రాజీనామా.
- “ముస్లింల కోసమే పార్టీ పని చేస్తోంది” అంటూ ఆరోపణలు.
- వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి కన్నా ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే మమతా బెనర్జీని ఇంకా ఎక్కువ భయపెడుతున్నాయి. మరికొంత కాలం తర్వాత టీఎంసీ ఉంటుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అరాచకాలపై సీఎం సువేందు అధికారి విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు, పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం దీదీని కలవరపెడుతోంది.
తాజాగా అస్సాం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అభిజిత్ మజుందార్ శుక్రవారం పార్టీకి రాజీనమా చేశారు. మజుందార్ తన లేఖను మమతా బెనర్జీకి ఈమెయిల్ చేశారు. తన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో పార్టీ ప్రతిష్ట క్రమంగా ‘‘కేవలం ముస్లింల కోసమే పనిచేసే సంస్థ’’గా మారిందని ఆరోపించారు. ఇదే వైఖరి బెంగాల్లో కూడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను టీఎంసీలో కొనసాగలేదనని, పార్టీ పనితీరు, రాజకీయ దిశ కారణంగా సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఆయన అన్నారు.
Also Read
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Food Inflation 2026: వంటగది బడ్జెట్కు బిగ్ షాక్.. వంట నూనె, పప్పులు, ఉల్లి, చక్కెర.. ధరలు పెరగడానికి అసలు కారణాలివే!
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
ఇప్పటికే బెంగాల్ టీఎంసీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వందలాది మంది పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి సంబంధిత వివాదాలపై పార్టీని సమర్థించలేకపోతున్నానని అన్నారు. ఇక టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ మరో రెండేళ్ల వరకు టీఎంసీ నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!