Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
- బెంగాల్ ఓటమి తర్వాత టీఎంసీలో కల్లోలం.
- అస్సాం టీఎంసీ చీఫ్ అభిజిత్ మజుందార్ రాజీనామా.
- “ముస్లింల కోసమే పార్టీ పని చేస్తోంది” అంటూ ఆరోపణలు.
- వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి కన్నా ప్రస్తుతం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే మమతా బెనర్జీని ఇంకా ఎక్కువ భయపెడుతున్నాయి. మరికొంత కాలం తర్వాత టీఎంసీ ఉంటుందా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తల అరాచకాలపై సీఎం సువేందు అధికారి విచారణ జరిపిస్తున్నారు. మరోవైపు, పార్టీ నేతలు వరసగా రాజీనామాలు చేయడం దీదీని కలవరపెడుతోంది.
తాజాగా అస్సాం తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ అభిజిత్ మజుందార్ శుక్రవారం పార్టీకి రాజీనమా చేశారు. మజుందార్ తన లేఖను మమతా బెనర్జీకి ఈమెయిల్ చేశారు. తన లేఖలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో పార్టీ ప్రతిష్ట క్రమంగా ‘‘కేవలం ముస్లింల కోసమే పనిచేసే సంస్థ’’గా మారిందని ఆరోపించారు. ఇదే వైఖరి బెంగాల్లో కూడా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను టీఎంసీలో కొనసాగలేదనని, పార్టీ పనితీరు, రాజకీయ దిశ కారణంగా సంబంధాలు కొనసాగించడం అసాధ్యమని ఆయన అన్నారు.
Also Read
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
ఇప్పటికే బెంగాల్ టీఎంసీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వందలాది మంది పార్టీ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. సీనియర్ టీఎంసీ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ శాంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. అవినీతి సంబంధిత వివాదాలపై పార్టీని సమర్థించలేకపోతున్నానని అన్నారు. ఇక టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కూడా పార్టీ మహిళా విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మరో టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీలోకి చేరేందుకు టీఎంసీ కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. కానీ బీజేపీ మరో రెండేళ్ల వరకు టీఎంసీ నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెబుతోంది.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!