Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులి బీభత్సం.. ఇద్దరు పశువుల కాపర్లపై దాడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger attack in Maharashtra.. Two killed: మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసి హతమార్చింది ఓ పెద్దపులి. జల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్(53), దివరూ వసలేకర్(55) ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు.
ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో వరసగా పలువురు పులుల దాడులకు గురువుతున్నారు. పశువులను వేటాడి చంపేస్తున్నాయి పులులు. దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్న కొమురంభీం జిల్లాలో కూడా పులుల సంచారం పెరిగింది. అటవీ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు పులుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత వారం చంద్రపూర్ జిల్లాలో 13 మందిని చంపిన పెద్దపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. దీని తర్వాత వారం తిరగకముందే మరో పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వెంపల్లిలో పశువుల మందపై పులి దాడి చేసింది. రెండు పశువులను హతమార్చింది.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: Russia-Ukraine War: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదలిపెట్టండి
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల అటవీ ప్రాంతంలో తాడోబా-అంధరి టైగర్ రిజర్వ్ ఉంది. పులుల ఆవాసానికి తాడోబా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రపూర్ జిల్లాలో పలు అటవీ గ్రామాల్లోని ప్రజలపై పులులు దాడులు చేస్తుంటాయి. ఇదిలా ఉంటే తాడోబా నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కు పులులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యేకంగా టైగర్ కారిడార్ ఉంది. దీంతో దీనికి అనుకుని ఉన్న గ్రామాలపై తరుచుగా పులులు దాడులు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అడపాదడపా పులుల సంచారం కనిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సరిహద్దులను ఆనుకుని మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో తాడోబా టైగర్ రిజర్వ్ ఉండగా.. చత్తీస్ గఢ్ బీజీపూర్ జిల్లాలో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఉంది. ఈ రాష్ట్రాలను వేరు చేస్తూ.. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులను దాటుకుని తెలంగాణలోకి పులుల వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!