Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులి బీభత్సం.. ఇద్దరు పశువుల కాపర్లపై దాడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger attack in Maharashtra.. Two killed: మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసి హతమార్చింది ఓ పెద్దపులి. జల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్(53), దివరూ వసలేకర్(55) ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు.
ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో వరసగా పలువురు పులుల దాడులకు గురువుతున్నారు. పశువులను వేటాడి చంపేస్తున్నాయి పులులు. దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్న కొమురంభీం జిల్లాలో కూడా పులుల సంచారం పెరిగింది. అటవీ ప్రాంతాలకు సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు పులుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత వారం చంద్రపూర్ జిల్లాలో 13 మందిని చంపిన పెద్దపులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. దీని తర్వాత వారం తిరగకముందే మరో పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వెంపల్లిలో పశువుల మందపై పులి దాడి చేసింది. రెండు పశువులను హతమార్చింది.
Also Read
Read Also: Russia-Ukraine War: భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదలిపెట్టండి
మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల అటవీ ప్రాంతంలో తాడోబా-అంధరి టైగర్ రిజర్వ్ ఉంది. పులుల ఆవాసానికి తాడోబా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రపూర్ జిల్లాలో పలు అటవీ గ్రామాల్లోని ప్రజలపై పులులు దాడులు చేస్తుంటాయి. ఇదిలా ఉంటే తాడోబా నుంచి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కు పులులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రత్యేకంగా టైగర్ కారిడార్ ఉంది. దీంతో దీనికి అనుకుని ఉన్న గ్రామాలపై తరుచుగా పులులు దాడులు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాచలం అడపాదడపా పులుల సంచారం కనిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సరిహద్దులను ఆనుకుని మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇటు మహారాష్ట్రలో తాడోబా టైగర్ రిజర్వ్ ఉండగా.. చత్తీస్ గఢ్ బీజీపూర్ జిల్లాలో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఉంది. ఈ రాష్ట్రాలను వేరు చేస్తూ.. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులను దాటుకుని తెలంగాణలోకి పులుల వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!