మహిళాల వివాహా వయస్సును 18 నుంచి21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు సంబంధించిన , బాల్య వివాహా సవరణ బిల్లును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు పై పలు విమర్శలు వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడమేనని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వివాహా వయస్సును తగ్గించి పెంచడం మంచిది కాదని విపక్షాలు అంటున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించాలని చూస్తున్నాయి. 18 ఏళ్లకే ఓటు హక్కుతో నాయకుడిని ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేదా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా మహిళలు పరిపక్వతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ బిల్లు పై వివాదంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది.
