తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ (సి. జోసెఫ్ విజయ్) ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ‘విజయ్ మామా’ అని పిలువబడుతున్న ఆయన తన స్పీచ్లో కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ, నిజాయితీ, పారదర్శకత, సామాజిక న్యాయం ఆధారంగా కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పిల్లలు ఆయన్ని ‘విజయ్ మామా’ అని పిలుస్తూ, ఎన్నికల్లో భారీ మద్దతు ఇచ్చారు. ఈ విజయం డబ్బు ఆధారిత రాజకీయాలకు చెక్ పెట్టి, నిజమైన సెక్యులర్ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా కొత్త అధ్యాయం ప్రారంభించిందని విజయ్ ఉద్ఘాటించారు.
మొదటి ప్రసంగం
సెక్యులర్ విలువలు: “నేను అన్ని మతాలకు చెందినవాడిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ – అన్ని మతాలు మన మతాలే. ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగి సెక్యులర్ స్టాండ్ను వదలను” అని విజయ్ స్పష్టం చేశారు. అన్ని మతాల ప్రార్థనా స్థలాలను సందర్శించి, ఏకతా సందేశం ఇచ్చారు.
సామాజిక న్యాయం: డ్రావిడియన్ మోడల్ను మరింత నిజమైన రూపంలో అమలు చేస్తామని, అందరికీ సమాన అవకాశాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వం కోసం పని చేస్తామని వాగ్దానం చేశారు. అణగారిన వర్గాలు, యువత, స్త్రీల సమస్యలపై ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ప్రజా సేవ: “నేను ఎవరి జట్టుకూ చెందను, ప్రజల జట్టుకు చెందినవాడిని. ఈ విజయం ప్రజల విజయం” అని ప్రకటించారు. ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేకత, అపవాదులను అధిగమించి, ప్రజల ప్రేమతో ఈ విజయం సాధించామన్నారు.
కొత్త యుగం: డబ్బు, కులాలు, మతాల రాజకీయాలు ముగిశాయని, నిజమైన మార్పు, పారదర్శకత, యువత ఆధారిత పాలనతో కొత్త తమిళనాడును నిర్మిస్తామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ..”నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే. మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసని అన్నారు. రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు. నేను మీకు హామీ ఇస్తున్నాను. అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను. ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.. నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.. తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.. నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.. చిన్నారులకు మామగా అండగా ఉంటా.. ఇది అస్థిర ప్రభుత్వం కాదు.. వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.. నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు. వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ తన ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు.
తొలి సంతకాలు
ప్రజా సంక్షేమం దిశగా సీఎం విజయ్ తన మొదటి సంతకాలతోనే ప్రజల ఆశలను నెరవేర్చడం ప్రారంభించారు:
ఉచిత కరెంట్పై తొలి సంతకం
మహిళల భద్రతపై రెండో సంతకం
తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం
డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సంతకం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం
