Sandip ghosh: సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్కు షాక్.. సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత
- సుప్రీంకోర్టులో ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్కు ఎదురుదెబ్బ
- సీబీఐ దర్యాప్తుపై వేసిన పిటిపిన్ కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కోల్కతా ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు చుక్కెదురైంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కోల్కతా హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా మరో ముగ్గురిని కస్టడీకి ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ జరుగుతోంది.
అయితే సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ సందీప్ ఘోష్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తును ఆపాలంటూ పిటిషన్లో కోరారు. శుక్రవారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. కోల్కతా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. సీబీఐ దర్యాప్తును సమర్థించింది. దీంతో సందీప్ ఘోష్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Also Read
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
కోల్కతా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రాజర్షి భరద్వాజ్తో కూడిన ధర్మాసనం ఆగస్టు 23న ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ ప్రారంభించింది. ఘోష్.. ప్రిన్సిపాల్గా ఉన్న సమయంలో ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఆసుపత్రి మాజీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే విచారణను కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది.
ఇదిలా ఉంటే శుక్రవారం సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సందీప్ ఘోష్ మరియు అతని ముగ్గురు సహచరుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారని ఒక అధికారిని తెలిపారు. బెలియాఘాటాలోని ఘోష్ నివాసం మరియు హౌరా, సుభాస్గ్రామ్లోని రెండు ప్రదేశాల్లో దాడులు జరిగాయి. ఉదయం 6.15 గంటలకు ఈ ప్రదేశాలకు చేరుకున్నామని.. దాడులు చేసినట్లు వెల్లడించారు. ఘోష్ ఫిబ్రవరి 2021 నుంచి సెప్టెంబరు 2023 వరకు ప్రిన్సిపాల్గా పనిచేశారు. అతను అక్టోబర్ 2023లో RG కర్ నుంచి కొంతకాలం బదిలీ చేయబడ్డాడు. కానీ ఒక నెలలోనే తిరిగి నియమించబడ్డాడు.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!