NTV Telugu Site icon

Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..

Evm Verification Plea

Evm Verification Plea

Supreme Court: కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది.

Read Also: YV Subba Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది..

ఈవీఎం నుంచి మెమోరీని చెక్ చేయడం, ధ్రువీకరించడాన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల్లో చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 15 రోజుల్లో తన స్పందన దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ పిటిషన్‌ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని విచారించింది.

ఇది వ్యతిరేకత కాదన, ఓడిపోయిన అభ్యర్థి స్పష్టత కోరుకుంటే, ఇంజనీర్ ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదని స్పష్టత ఇవ్వొచ్చు అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయబడలేదని నిరూపించడానికి ఈవీఎంలో కాల్చేసిన మెమోరీని, మైక్రోకంట్రోలర్‌ని ఇంజనీర్ ధ్రువీకరించాలని కూడా పిటిషన్ డిమాండ్ చేసింది. తదుపరి విచారణ మార్చి 3 నుంచి ప్రారంభమయ్యే వారంలో జరగనుంది.

ఏడీఆర్ తరుపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం అవలంబించాల్సిన విధానం వారి ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్‌కి అనుగుణంగా ఉండాలని మేము కోరుతున్నాము. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ లో ఏదైనా అవకతవకలు ఉన్నాయో లేదో అని చూడాలనికి ఈవీఎంల సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లని పరిశీలించాని మేము కోరుతున్నాము’’ అని అన్నారు.