Rahul Gandhi: ‘‘చైనా 2,000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకెలా తెలుసు.?’’ రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..
- చైనా 2000 కి.మీ భూమి ఆక్రమించిందని మీకెలా తెలుసు..?
- నిజమైన భారతీయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు..
- రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
- పరువునష్టం కేసులో నోటీసులు జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘చైనా 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు..? నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా, చైనా భారతదేశానికి సంబంధించిన 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని ఒక ఆర్మీ ఆఫీసర్ తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనపై మండిపడింది.
Also Read
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
Read Also: Anil kumar yadav: డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్
2020 జూన్లో లడఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎజి మాసిహ్లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం లొంగిపోయిందని రాహుల్ గాంధీ ఆ సమయంలో ఆరోపించారు. పరువు నష్టం కేసును రద్దు చేయాలన్న రాహుల్ గాంధీ విజ్ఞప్తికి వ్యతిరేకంగా కోర్టు నోటీసు జారీ చేసింది.
అయితే, రాహుల్ గాంధీ తరుపున విచారణకు హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలను వినిపిస్తూ.. ‘‘ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు..?’’ అని అడిగారు. దీనికి ప్రతిగా, ‘‘అలాంటప్పుడు ఈ విషయాలను పార్లమెంట్లో ఎందుకు చెప్పరు..? సోషల్ మీడియాలో ఎందుకు చెప్పాలి..?’’ అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
-
Ramayana: ట్రైలర్కు ముందే ‘పుష్ప’ రికార్డ్ బద్దలు.. ‘రామాయణం’ మ్యూజిక్ రైట్స్కు రూ.75 కోట్ల డీల్!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు.. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు!
-
NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు.!
-
Hyderabad: మియాపూర్లో విషాదం..! ఓపెన్ మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!