Rahul Gandhi: ‘‘చైనా 2,000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకెలా తెలుసు.?’’ రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం..
- చైనా 2000 కి.మీ భూమి ఆక్రమించిందని మీకెలా తెలుసు..?
- నిజమైన భారతీయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు..
- రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
- పరువునష్టం కేసులో నోటీసులు జారీ..
Rahul Gandhi: భారత సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందరకు కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసుల దాఖలైంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలని రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘చైనా 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు..? నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’’ అని జస్టిస్ దత్తా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా, చైనా భారతదేశానికి సంబంధించిన 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని ఒక ఆర్మీ ఆఫీసర్ తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనపై మండిపడింది.
Read Also: Anil kumar yadav: డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి అనిల్
2020 జూన్లో లడఖ్లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎజి మాసిహ్లతో కూడిన ధర్మాసనం తీవ్రంగా వ్యతిరేకించింది. చైనా ముందు నరేంద్రమోడీ ప్రభుత్వం లొంగిపోయిందని రాహుల్ గాంధీ ఆ సమయంలో ఆరోపించారు. పరువు నష్టం కేసును రద్దు చేయాలన్న రాహుల్ గాంధీ విజ్ఞప్తికి వ్యతిరేకంగా కోర్టు నోటీసు జారీ చేసింది.
అయితే, రాహుల్ గాంధీ తరుపున విచారణకు హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలను వినిపిస్తూ.. ‘‘ఆయన ఈ విషయాలు చెప్పలేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారు..?’’ అని అడిగారు. దీనికి ప్రతిగా, ‘‘అలాంటప్పుడు ఈ విషయాలను పార్లమెంట్లో ఎందుకు చెప్పరు..? సోషల్ మీడియాలో ఎందుకు చెప్పాలి..?’’ అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
-
Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్ లేని టాలీవుడ్
-
V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
-
Hansika : హన్సిక పై మండిపడుతున్న నెటిజన్ల..
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
ట్రెండింగ్
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!