PM Modi: మళ్లీ భూప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉంది.. అలర్ట్గా ఉండండి

  • నేడు ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..
  • ఎవరు భయపడొద్దని తెలిపి ప్రధాని..
  • మరోసారి భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయి: ప్రధాని మోడీ
Pm Modi

Pm Modi

PM Modi: ఈ రోజు (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు.. అందరు ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, మరోసారి భూ ప్రకంపనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.. కావున, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు.

Read Also: Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం

×
×
Ad

అయితే, ఢిల్లీ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారు జామున కొద్ది సెకన్ల పాటు భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. కాగా, ఉదయం 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక, ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.