Social Media : సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు షేర్ చేస్తే.. ఇక జైలుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాను అందరు వాడేస్తున్నారు.. అయితే ప్రపంచంలో జరిగే వాటిని చూడటం మాత్రమే కాదు.. మనకు నచ్చిన వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం.. అలాంటి వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.. ఏదైన పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. మనం పెట్టే పోస్టు ఎక్కడి దాక వెళ్తుంది..
ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే అని చెబుతుంది.. ఇటీవల తమిళనాడు మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది… ఓ జర్నలిస్ట్ పై ఓ వ్యక్తి పోస్ట్ ను షేర్ చేశాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఆ ఎమ్మెల్యే పై పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇక ఎమ్మెల్యే చెన్నై కోర్టును ఆశ్రయించారు. అనుకోకుండా జరిగింది. కేసు కొట్టేయాలని అభ్యర్థించారు. దీనికి నిరాకరించిన హైకోర్టు.. పిటిషన్ను తోసిపుచ్చింది. వెంటే ఆ ఎమ్మెల్యే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 ఏప్రిల్ 20న తన క్లయింట్ కళ్లలో మందు వేసుకోవడం వల్ల ఫేస్బుక్లో కనిపించిన పోస్టును సరిగా చూడకుండానే షేర్ చేశారు అని తన తరుపు న్యాయవాది వాధించారు..
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ఆ అభ్యంతకర పోస్టును తొలగించడం తో పాటు, ఆ జర్నలిస్ట్ కు క్షమాపణలు కూడా చెప్పినట్లు ఒప్పుకున్నారు..అనుకోని పొరబాటుగా పరిగణించి క్రిమినల్ కేసు కొట్టేయాలని వేడుకున్నారు. దీనిపై ఏకీభవించని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాతో జాగ్రత అవసరమని కన్నెర్ర చేసింది ధర్మాసనం. పోస్టు పెట్టి సారీ చెబితే సరిపోదని తేల్చి చెప్పింది. ఇక దీని పర్యావసానం కూడా ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. అందుకే సోషల్మీడియా వాడకం ఎంత అవసరమో.. అంత కన్న ఎక్కువగా పొరపాట్లు కూడా ఉన్నాయి.. ఏదైనా అభ్యంతర పోస్టులను పెట్టే ముందు ఇది ఆలోచించి పెట్టడం మంచిదని అధికారులు హెచ్చరిస్తుంది.. సో తస్మాత్ జాగ్రత్త..
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!