Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన

  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు
  • పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్
  • కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Siya Goyal, Lover Chetan Ch

Siya Goyal, Lover Chetan Ch

2026 జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ ఫోర్ట్ (Lohagad Fort)లో 26 ఏళ్ల వ్యాపారి (రియల్ ఎస్టేట్) కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సీయా గోయల్ (20), ఆమె ప్రేమికుడు చేతన్ చౌధరీ (22) కలిసి క్లిఫ్ నుంచి (సుమారు 400 అడుగుల లోయలోకి) తోసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో ఇది ట్రెక్కింగ్ సమయంలో అకస్మాత్తు పడిపోయినట్లు భావించినా, తర్వాత ప్రణాళికాబద్ధమైన హత్యగా బయటపడింది. సీయా, కేతన్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. సీయా వివాహానికి ఇష్టపడలేదు, కానీ కుటుంబ గౌరవం కారణంగా రద్దు చేయడం కష్టమని భావించి, చేతన్‌తో కలిసి హత్య ప్లాన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను పోలీసులు ఘటన జరిగిన పూణే సమీపంలోని కోటకు తీసుకెళ్లి నేరం ఎలా జరిగిందో సీన్ రీక్రియేట్ (Crime Scene Recreation) చేశారు. నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఘటనాస్థలానికి తీసుకెళ్లిన పోలీసులు, హత్యకు ముందు నుంచి తర్వాత వరకు జరిగిన పరిణామాలను వివరించాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా బాధితుడిని ఎక్కడికి తీసుకెళ్లారు? హత్య ఎలా జరిగింది?, నేరానికి ఏ వస్తువులు ఉపయోగించారు? ఘటన అనంతరం ఏం చేశారు? వంటి అంశాలను నిందితులతో చూపించి రికార్డు చేశారు. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించి దర్యాప్తు రికార్డులో చేర్చినట్లు సమాచారం. హత్య జరిగిన పది రోజుల తర్వాత ఈ ప్రక్రియ చేపట్టడం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. నిందితుల వాంగ్మూలాలు, ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు ఒకదానితో ఒకటి సరిపోల్చేందుకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

కుటుంబ సభ్యుల్లో ఆవేదన

మరోవైపు, బాధితుడి కుటుంబ సభ్యులు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

దర్యాప్తు కొనసాగుతోంది

ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, మొబైల్ ఫోన్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాక్ష్యాల ఆధారంగా ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.