Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..

  • మోడీ నా సలహా పాటించారు..
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై శరద్ పవార్..
Sharad Pawar

Sharad Pawar

Sharad Pawar: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం, నిరసనకారులతో చర్చలు జరపాలని తానే సూచించినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీకి స్వయంగా తానే సలహా ఇచ్చినట్లు తెలిపారు. విలేకరులతో మాట్లాడిన ఆయన.. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, దేశ యువశక్తికి ఐక్యతకు ఇది గొప్ప విజయమని, నిరసనకు నైతిక మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోడీతో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో చర్చలే పరిష్కార మార్గం అని తాను ప్రధానితో చెప్పానని, చర్చలు ప్రారంభించాలని సూచించానని, అలాగే ఉద్యమ నేతలు అభిజిత్ దీప్కే తదితరులతో మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వ చర్చలకు సిద్ధంగా ఉ:దని వివరించానని, చివరకు చర్చలు ప్రారంభమయ్యాయని, మోడీతో తాను జరిపిన చర్చల ఫలితమే ఈ రోజు కనిపించిందని పవార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై కూడా ఆయన స్పందిస్తూ.. ఈ తరంతో వ్యవహరించేలాప్పుటు అలాంటి చర్యలు నివారించి ఉంటే బాగుండేదని అన్నారు.