Jagadguru: ‘‘కాషాయం దేవుడి రంగు’’.. ఖర్గేపై జగద్గురు మండిపాటు..
- కాషాయం ధరించిన వారు రాజకీయాలు చేయొద్దని ఎక్కడ ఉంది..?
- కాషాయం అంటే భగవంతుడి రంగు..
- మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై జగద్గురు మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadguru: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలను వదిలిపెట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్య మండిపడ్డారు. ఖర్గే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. దేవుడి రంగు కాషాయమని, కాషాయ రంగులో ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని వాదించారు.
‘‘రాజకీయాల్లో గుండాలు ఉండాలా..? లోఫర్లు రాజకీయాలు చేయాలా..? భగవధారి రాజకీయాలు చేయాలి. కాషాయం ధరించిన వారు రాజకీయాల్లోకి రావద్దని ఎక్కడ రాశారు..? శివాజీ కాషాయ పతాకంతో దేశాన్ని మహారాష్ట్రని ఏకం చేశారు. సూట్లు, బూట్లు ధరించిన వారు దేశంలో రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు.
Also Read
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
Read Also: Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..
యోగి వ్యాఖ్యలు ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనం అవుతాం) అనే నినాదాన్ని ఉద్దేశిస్తూ ఖర్గే ఇటీవల విమర్శలు గుప్పించారు. కాషాయం ధరించి సాధువులమని చెప్పుకునే వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలని సోమవారం ముంబైలో అన్నారు. ‘‘చాలా మంది నాయకులు సాధువుల వేషధారణలో ఉంటూ ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వారు కాషాయ బట్టలు వేసుకుంటారు. తలపై వెంట్రుకలు లేవు. తెల్లబట్టలు వేసుకోవాలి, సన్యాసి అయితే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను బీజేపీకి చెబుతా’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. కాషాయం ధరించి ప్రజల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యోగిపై మండిపడ్డారు.
జగద్గురు రాంభద్రచార్య మాట్లాడుతూ.. యోగి ‘‘బాటేంగే తో కటేంగే’’ నినాదాన్ని సమర్థించారు. మనం విడిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. వర్గాలు వేరైనప్పటికీ హిందువులు అంతా ఒక్కటే అని చెప్పారు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ హాని చేయలేరని, ఒక్క వేలు బలహీనంగా ఉన్నా, పిడికిలి బలంగా ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్హౌస్లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!