Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి

  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం
  • ప్రవర్తనతో ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
  • భారతీయ కుటుంబాలుకు పిలుపు
Mohan Bhagwat

Mohan Bhagwat

భారతీయ కుటుంబాలు, ప్రతి వ్యక్తి తమ ప్రవర్తన ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ప్రవర్తన కావాలని.. అప్పుడే భారత్ తన విశ్వమానవ ధ్యేయాన్ని విజయవంతంగా నెరవేర్చగలదని పేర్కొన్నారు.

స్వయంసేవకుల జీవిత లక్ష్యం, దేశ సేవ, భారత భవిష్యత్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభూమి సేవకు స్వచ్ఛందంగా అంకితమై నిరంతరం నిజమైన స్వయంసేవకులుగా మారేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పాన్ని మనం స్వచ్ఛందంగా స్వీకరించాం. నిజమైన స్వయంసేవకులుగా ఎదగడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఒక స్వయంసేవకుడు సాధించగల పరిపూర్ణతకు ఎలాంటి హద్దులు లేవు. ఆ పరిపూర్ణత శిఖరాన్ని డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ జీవితంలో మనం చూశాం.’’ అని తెలిపారు. ఆ పరిపూర్ణత సాధించాలంటే నిరంతర సాధన అవసరమని పేర్కొన్నారు. సౌకర్యాలతో అలాంటి సాధన సాధ్యం కాదని.. క్రమశిక్షణ, త్యాగం, నిరంతర కృషి ద్వారానే నిజమైన స్వయంసేవకుడిగా ఎదగవచ్చని వివరించారు.

ప్రపంచానికి భారత్ ప్రత్యేకమైన సందేశాన్ని అందించే బాధ్యత కలిగిన దేశమని మోహన్ భగవత్ అన్నారు. ‘‘భారత్ తన ప్రపంచ ధ్యేయాన్ని నెరవేర్చాలంటే.. ముందుగా ఆ ఆదర్శాన్ని తన జీవితంలో ఆచరణలో చూపించే దేశంగా మారాలి. ప్రపంచానికి ఏ జీవన విధానాన్ని చూపించాలనుకుంటుందో, అదే విధానాన్ని భారతీయులు తమ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఆచరించాలి.’’ అని సూచించారు.

ఇదిలా ఉంటే ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై తొలిసారి ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఈ ఘటనతో రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రకటనలో తెలిపింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ తరపున సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే ఈ ప్రకటనను విడుదల చేశారు.