జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పదవి నుంచి మంగళవారం అనూహ్యంగా తప్పుకున్నారు. రేఖా శర్మ ఆగస్టు 7, 2018 నుంచి ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2021, ఆగస్టులో మూడేళ్ల పాటు పదవి పొడిగించారు. 2015 నుంచి కమిషన్లో సభ్యురాలిగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు పదవీలో కొనసాగారు. మంగళవారమే చివరి రోజు అని ఆమె పేర్కొన్నారు.
Rekha sharma: రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం.. ఎన్సీడబ్ల్యూ పదవికి గుడ్బై
- జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ సంచలన నిర్ణయం
- ఎన్సీడబ్ల్యూ పదవికి గుడ్బై.. మంగళవారమే చివరి రోజు అని వ్యాఖ్య